DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31 న శ్రీకాకుళంలో యువతకు ఉపాధి కల్పన శిబిరం 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, మార్చి 30, 2021  (డి ఎన్ ఎస్):*     

శ్రీకాకుళం, మార్చి 30  : శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా ఉపాధికల్పన అధికారి వారి కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 11.00గం.లకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి

జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, మల్లవల్లి, కృష్ణా జిల్లాలో ట్రైనీ ఆపరేటర్ పోస్టుల రిక్రూట్ మెంట్ కొరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
జాబ్ మేళా నందు అర్హత పొందిన వారికి 6 మాసాల శిక్షణ ఇవ్వబడుతుందని, శిక్షణ కాలంలో నెలకు

రూ.9,000/-లు మరియు వసతి, సబ్సిడరీ ఫుడ్  అందజేయడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం వారి ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా జీతం పెంపుదల ఉంటుందని తెలిపారు. ట్రైనీ ఆపరేటర్లరో టెక్నికల్,నాన్ టెక్నికల్ విభాగాలు ఉన్నాయన్నారు. టెక్నికల్ విభాగానికి ఐ.టి.ఐ డిప్లోమా పూర్తిచేసి, 18-30 సం.ల వయస్సు లోపు గల యువతీ యువకులు అర్హులని చెప్పారు. 
/> అలాగే నాన్ టెక్నికల్ విభాగానికి 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అర్హులేనని చెప్పారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తేది 31.03.2021న ఉదయం 11.00గం.లకు బలగ వద్ద గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రోడ్డు దరిలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్దకు హాజరుకావాలని చెప్పారు. 
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్ధులు తమతో పాటు బయోడేటా,

సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, 4 పాస్ ఫొటోలు తీసుకురావాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam