DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వన్ నేషన్ - ఒకే పర్మిట్ పన్ను, టూరిస్ట్ లకు కేంద్రం వరం

*ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్‌ టాక్స్ లు అమలులోకి?* 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 31, 2021  (డిఎన్ఎస్):* పర్యాటక పరంగా వాహనాలకు ఇచ్చే పర్మిట్ల పై  సత్వర పరిష్కారం తో ఇక పై ఏ రాష్ట్రానికైనా వెళ్లే వెసులుబాటు కలుగనుంది. త్వరలో అమలుకు రవాణాశాఖ

సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు నుంచి బస్సులు, వాన్ ల వరకూ అన్ని తరహాల వాహనాలు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. 
ఇప్పడి వరకు ఒక రాష్ట్ర పరిధి దాటితే ప్రక్కరాష్ట్రం చెక్ పోస్ట్ / టోల్ గెట్ దగ్గర మరో పర్మిట్ పన్ను కు డబ్బులు తప్పని సరిగా చెల్లించాలి.

దీంతో పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. పైగా గడువు తేదీ లోగా తిరిగి వెనక్కి రాకుంటే. . .మరో జరిమానా అదనం.  కొత్త విధానం ఇలాంటి ఇబ్బందులను తొలగించనుంది. తద్వారా పర్యాటకుల రాక తో రాష్ట్రాలోని పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి పరచడం ద్వారా వాటికి అదనపు ఆదాయం రానుంది. పర్యాటకుల రాకతో హోటల్ రంగం కూడా

మెరుగుపడనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam