DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమహేంద్రవరం పోలీసుల అదుపులో బ్లేడ్ బ్యాచ్

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 1, 2021  (డిఎన్ఎస్):*  తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో బ్లేడ్-బ్యాఛ్ కి చెందిన కొందరు వ్యక్తుల బ్లేడ్లు ఉపయోగించి దొంగతనాలు చేస్తున్న బృందాల్లో 5 గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. అర్బన్ జిల్లా ఎస్పీ డా. షీముషి బాజ్‌పాయ్ ఆదేశాల

మేరకు నగర పోలీసులకు అందిన సమాచారం ప్రకారం గురువారం బొమ్మూరు సిఐ కె. లక్ష్మణ్ రెడ్డి సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. నగర పరిధిలోని డంపింగ్ యార్డ్, సి-బ్లాక్ అపార్ట్మెంట్, అగ్రి గోల్డ్  లేఔట్ రోడ్డు, సాటీలైట్ సిటీ, రాజమహేంద్రవరం రూరల్ వద్ద బ్లేడ్-బ్యాఛ్ కి చెందిన 1. ఆదిములం బలరాం మణికంఠ @ సాయి సూర్య తేజ @ బొండాలు 2.

ఇళ్ళ క్రాంతి కుమార్ @ క్రాంతి 3. తవితికి అక్షయ్ 4. మొహమ్మద్ ఇద్రేష్ ఖాన్  5. పితాని వీరబాబు @ డేగ   అను  వారు నేరం చేసే ప్రయత్నంలో ఉండగా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు పదునైన బ్లేడ్ లను స్వాధీనపర్చుకొని వారి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడమైనది.
    ఈ సందర్బంగ ఎస్పీ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఇటివల

కాలంలో బ్లేడ్-బ్యాఛ్ గా చెప్పుకుంటూ సామాన్య జనాలను బ్లేడ్ లను చూపించి వారిని గాయా పరుచుతూ దోపిడిలు, దొంగతనాలు చేస్తున్నారని, అట్టి వ్యక్తుల కదలికల పై నిరంతరం గట్టి నిఘా ఉంచి వారిపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam