DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న తిరుపతిలో బీజేపీ తరపున ప్రచారానికి టైగర్ రాజాసింగ్

*తిరుపతి ఎన్నికల ప్రచారంలోకి తెలంగాణ బీజేపీ టైగర్స్* 

*3 న ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇతర నేతల రాక*

*ఊపందుకుంటున్న తిరుపతి ఉపఎన్నిక ప్రచార పర్వం*

*హిందూ గుళ్లపై దాడులే ప్రచార పర్వంలో ప్రధాన అస్త్రాలా ?*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి  /

విశాఖపట్నం, ఏప్రిల్ 2, 2021 (డిఎన్ఎస్):* తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ చాల సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభ తరపున ఎన్నికల ప్రచారం కోసం రంగం లోకి తెలంగాణ బీజేపీ దిగ్గజాలను వినియోగిస్తోంది. ఈ నెల 4 న తెలంగాణ బీజేపీ టైగర్, ప్రతిపక్షాలకు, గోహతకులకు

ముచ్చెమటలు పట్టిస్తున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తిరుపతి లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం  చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పడికే రాజాసింగ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి నేరుగా కొన్ని సూచనలు చేసారు. ఏపీ లో మతమార్పిళ్లు, హిందూ దేవాలయాలు, దేవి దేవతలపై దాడుల నేపథ్యంలో హిందువుల మనోభావాలు సక్రమంగా

పరిరక్షించక పొతే తాను స్వయంగా రంగం లోకి దిగుతానంటూ హెచ్చరిక సూచనలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి.  నేడు తిరుపతి ఉప ఎన్నికల పర్వంలో ఈ అంశాలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై నేరుగా భాణాలు సంధిచే అవకాశం ఉంది.

అదే విధంగా ఈ నెల 3 వ తేదీ న దుబ్బాక ( తెలంగాణ) ఎమ్మెల్యే రఘునందన్ రావు, సహా ఇతర బీజేపీ నేతలు, తిరుపతి

ఎన్నికల ప్రచారానికి రానున్నారు. 

దీంతో శనివారం నుంచి తిరుపతి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ నేతలకు తగిన సత్తా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నేతలపై పూర్తిగా ఆధారపడిపోయింది. ప్రస్తుతం ప్రక్షాళన దిశగా సాగుతున్న చర్యల్లో తిరుపతి ఉప ఎన్నికలు  బాగా ఉపయోగ పడనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam