DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాడు టీడీపీ - నేడు వైకాపా దొందూ కి దొందే: దుబ్బాక ఎమ్మెల్యే

*తిరుపతి బీజేపీ ప్రచారం లో తెలంగాణ ఫైర్ బ్రాండ్  రఘునందన్*

*బీజేపీ ప్రచారంతో కాషాయమయంగా మారిన తిరుపతి వీధులు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి  / విశాఖపట్నం, ఏప్రిల్ 3, 2021 (డిఎన్ఎస్):* గతం లో తెలుగుదేశం పార్టీ, నేడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు

దొందూ కి దొందేనని, ఆంధ్ర ప్రదేశ్ ని దోచుకుతినేవేనని, దుబ్బాక ( తెలంగాణ) ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.
ప్రజా బలంతో, అధికార TRS పార్టీ వెన్నులో వణుకు పుట్టించిన తెలంగాణ బిజెపి ఫైర్ బ్రాండ్, రఘునందనరావు శనివారం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభ తరపున ఎన్నికల

ప్రచారం కోసం రంగం లోకి దిగారు. తిరుపతి లో గెలుపు కోసం బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ దిగ్గజాలను వినియోగిస్తోంది. దీనిలో భాగంగానే శనివారం రఘునందన్ రావు తిరుపతి లో ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి రెండు పార్టీలు  గుండు సున్నాయెనని, 2014 లో తెలుగుదేశం ఏపీకి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజి ఒకే అని

అడిగిన వాళ్ళు, 2019 లో ఎన్నికలు రాగానే. .. నెపం బీజేపీ పై నెట్టేశారన్నారు.  తదుపరి కొనసాగింపు గా 2019  ఎన్నికల ప్రచారం లో వైకాపా కూడా ఆంధ్ర ప్రజలని నట్టేట్లో ముంచిందన్నారు. 22 ఎంపీ లని లోక్ సభ కి పంపితే. . .కేంద్రం మెడలు వంచైనా సరే     ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా తీసుకు వస్తామని చెప్పిన వై ఎస్ అర్

కాంగ్రెస్ ఎంపీ లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 

శనివారం నుంచి తిరుపతి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ నేతలకు తగిన సత్తా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నేతలపై పూర్తిగా ఆధారపడిపోయింది. ప్రస్తుతం ప్రక్షాళన దిశగా సాగుతున్న చర్యల్లో తిరుపతి ఉప ఎన్నికలు  బాగా ఉపయోగ

పడనుంది. 

రఘునందన్ రావు కు ఘన స్వాగతం. . .

హైదరాబాద్ నుంచి తిరుపతి కి వచ్చిన దుబ్బాక ఎంనేలే రఘునందన్ రావు కు తిరుపతి విమానాశ్రయం లో బీజేపీ ఆంధ్ర శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam