DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అడవి లో మావోల దొంగ దెబ్బ కు భారీ మూల్యం. .చెల్లిస్తారా.

*ఛత్తీస్ ఘర్ లో 31 మంది జనావాన్ల మృతి, కేంద్రం సీరియస్*  

*దండకారణ్యం లో అణువణువూ జల్లెడ పట్టేందుకు రంగం సిద్ధం*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 4, 2021 (డిఎన్ఎస్):* దేశంలోని అంతర్గత అసాంఘిక శక్తులు ఒక్కసారిగా పెట్రేగిపోవడంతో భారీ మూల్యం

చెల్లించుకోవాల్సి స్థితి ఏర్పడింది. ఛతీష్ గడ్ రాష్ట్రంలో బీజాపూర్ - సుకుమా సరిహద్దు లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోలు దొంగ దెబ్బ తీయడంతో సుమారు 31 మందికి పైగా భారతీయ జవాన్లు అసువులు బాసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ గా స్పందిస్తోంది. దండకార్యణ్యంలో మొత్తం జల్లెడ పట్టేందుకు

సిద్ధమైపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది జవాన్లు ( సీఆర్ పిఎఫ్, సీఆర్ పిఎఫ్, ఛత్తీస్ ఘర్ పోలీస్ గార్డ్ లు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు) మరణించినట్టు అధికారిక ప్రకటన. ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టేందుకు సుమారు 500 - 650 మంది రక్షణ బలగాలు దీనిలో పాల్గొన్నాయి. అడవి ప్రాంతంలోని రెండు కొండల సమీపంలోకి వీరిలో ఒక బృందం చేరుకోగానే మావోలు

ఒక్కసారిగా దాడి చేసినట్టు సమాచారం. అత్యాధునిక మారణాయుధాలతో దాడి చెయ్యడంతో పాటు, ముందుగా జవాన్ల చేతులు నరికి తర్వాత కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. 

ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర హోమ్ శాఖా రంగం లోకి దిగింది. ఛత్తీస్ ఘర్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులను అప్రమత్తం చేసింది.

దండకారణ్యాన్ని పూర్తి జల్లెడ పట్టేందుకు సిద్ధమైంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam