DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువతను ఆకర్షించేందుకే బీజేపీ వదిలే క్షిపణి ఈ సూర్య అస్త్రం

*త్వరలో తిరుపతిలో ప్రచారానికై బిజెవైఎం చీఫ్ తేజస్వి సూర్య*

*బెంగాల్, కేరళ, తమిళనాడు లో తేజస్వి కి భారీ స్పందన* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి  / విశాఖపట్నం, ఏప్రిల్ 4, 2021 (డిఎన్ఎస్):* దేశవ్యాప్తంగా ప్రస్తుతం మారుమ్రోగుతున్న పేరు తేజస్వి సూర్య.  . తిరుపతి ఉప

ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బరిలో నిలిచిన బీజేపీ తన అమ్ముల పొడిలోని ఒక్కొక్క రాష్ట్రాన్ని ప్రయోగిస్తోంది. దానిలో భాగమే మరో రెండు రోజుల్లో విడుదల కానున్న రాష్ట్రం తేజస్వి సూర్య. బీజేవైఎం జాతీయ అధ్యక్షునిగా ఉన్న ఈ నేత  యువతను ఆకట్టుకోవడం లో దిట్ట. తిరుపతి ఎన్నికల్లో రత్నప్రభ తరపున ఎన్నికల ప్రచారానికి రంగంలోకి

దిగనున్నాడు. తిరుపతి లోని 7 అసంబ్లీ నియోజక వర్గాల్లో యువ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ రాష్ట్రం బీజేపీ గెలుపుకు ఉపయోగపడనుంది.  

కర్ణాటక లోని బెంగుళూరు దక్షిణ లోక్ సభ ఎంపీ ఘన విజయం సాధించిన లాక్య సూర్యనారాయణ తేజస్వి (తేజస్వి సూర్య) వాగ్దాటి, ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు గమనించి, అతన్ని భారతీయ  జనతా యువ

మోర్చా కు జాతీయ అధ్యక్షునిగా చేసింది బీజేపీ. అతని  రాక తో బీజేవైఎం లో ఎన్నో మార్పులు జరిగాయి. యువతను ఆకర్షించేందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తిరుగుతూ పార్టీని బలోపేతం చేసే భాద్యతను అతనిపై పెట్టింది పార్టీ. 

అస్సామ్, తెలంగాణ, మణిపూర్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ల్లో విస్తృత ప్రచారం చేసి,

విమర్శకుల ప్రసంశలు సైతం అందుకున్నాడు. ప్రతి రాష్ట్రంలోనూ సూర్య చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించడం తో పాటు, అభ్యర్థులు విజేతలుగా నిలిచారు.  

తెలంగాణ లో గ్రేటార్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో , కేరళ లోను ఎక్కడ ప్రచారం చేసిన సంచలనమే.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam