DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ ను విష్ణు మూర్తి తో పోలుస్తారా?: శ్రీవిద్య గణేశనంద మండిపాటు

*పదవీకాంక్షతో అమ్ముడు పోయి దైవద్రోహం చేస్తున్నావు. ..*  

*వివాదాస్పదంగా మారుతున్న రమణ దీక్షితుల వ్యాఖ్యలు*

*తిరుమల అర్చకులు వైఎస్ జగన్ కు ఋణపడి ఉన్నారా. . .?*  

*టిటిడి అర్చకుని వ్యాఖ్యల పై హిందూ సమాజం ఆగ్రహం.*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి,

ఏప్రిల్ 6, 2021  (డిఎన్ఎస్):* ఉద్యోగం తిరిగి వచ్చిందన్న అమితానందంతో ఏమి మాట్లాడుతున్నారో కూడా టిటిడి అర్చకుడు రమణ దీక్షితులు ఉన్నాడని, స్వామి శ్రీవిద్య గణేశనంద మండిపడ్డారు. టిటిడి వంశపారంపర్య అర్చకులకు పదవి విరమణను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహంలో ఉన్న రమణ దీక్షితులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్

జగన్ ను కలిశారు. ఈ క్రమం లోనే సీఎం ను విష్ణుమూర్తి తో పోల్చడం పై సాధు సమాజం, హైందవ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ కు చెందిన విద్యగణేశ పీఠం నిర్వాహకులు రమణ దీక్షితులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.  

రమణ దీక్షితులు సహా. . . టిటిడి అర్చకులకు అండగా ఉంది, పూనర్నియమకానకి

ఏందరో స్వామీజీలు ఆశీర్వదించింది మర్చిపోయి స్వార్ధ పదవీకాంక్ష తో అమ్ముడుపోయి ధర్మవధ దైవద్రోహం చేస్తున్నావు వినాశనం కోరి తేచ్చూకోకు అని హచ్చరించారు. 

సామాన్య మానవుడిని శ్రీనివాసునీతో పోల్చడానికి దిగజారి పోవడాన్ని భక్తులు తట్టుకోలేరన్నారు. తక్షణం నీ వ్యాఖ్య విరమించుకోని భక్తులకు బహిరంగ క్షమాపణ

చేప్పి పాప ప్రక్షాళన చేసుకో అని డిమాండ్ చేసారు. 

అర్చకులు వైఎస్ జగన్ కు ఋణపడి ఉన్నారా. . . ? 

తిరుమల అర్చకులు వైఎస్ జగన్ కు రుణపడి ఉన్నారు అంటూ. . .తిరుమల వంశపారంపర్య అర్చకులు డా. రమణ దీక్షితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

తిరుమల వంశ పారంపర్య

అర్చకులకు ఆ శ్రీవారి సేవలో ఉండే అవకాశం ఇచ్చింది శ్రీనివాసుడేనని, వీళ్ళు తిరుమల స్వామి కే  తప్ప ఇతరులకు కాదు అన్నది హైందవ సమాజం తెలియచేస్తోంది. 

అలాంటింది దేవాదిదేవుడైన వేంకటేశ్వరుని వదిలేసి, జగన్ కు ఋణ పడిఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి ఉద్యోగాలు జగన్ ఇచ్చాడా అని

ప్రశ్నిస్తున్నారు. 

వీళ్ళ వంశాలకు తిరుమల లో  స్వామి అర్చన అవకాశం కల్పించింది ఇప్పడి ప్రభుత్వాలు కాదు. నేరుగా వెంకటేశ్వరుడే. . . వీళ్ళు ఎప్పడికైనా రుణపడి ఉండాల్సిందే ఆయనకే తప్ప మానవమాత్రులకు కాదు అన్నది హైందవ సమాజం మాట. 

వైఎస్ జగన్ పట్ల కృతజ్ఞత చూపుకోవాలంటే ఇంకోలా చెయ్యాలె తప్ప ఇలాంటి

ప్రకటనలు చెయ్యకూడదన్నది ఆస్తిక సమాజం మాట.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam