DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ శాఖ ఆర్జేసీ గా త్రినాథ రావు బాధ్యతల స్వీకరణ 

*అన్నవరం ఈఓ కు అదనపు భాద్యతలు అప్పగింత*

*దేవాదాయ శాఖలో బదిలీలు - వెంటనే హఠాత్ మార్పులు*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 9, 2021  (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ( ఆర్ జె సి ) గా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి

దేవస్థానం ఈఓ వి. త్రినాథ రావు భాద్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఆయన పదవి భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయనకు అదనపు భాద్యతలు అప్పగించారు. 

విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెలుగు చూసిన అక్రమాల నేపథ్యంలో దేవాదాయ శాఖా తీసుకున్న బదిలీలలో భాగంగా హఠాత్తు పరిణామాలు వేలుచూసాయి. దుర్గ గుడి ఈఓ సురేష్ బాబు ను తక్షణం

తొలగిస్తూ, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ జె సి గా ఉన్న డి. భ్రమరాంబ ను దుర్గ గుడి ఈఓ గా బదిలీ చేసారు. దీంతో ఖాళీ అయినా రాజమహేంద్రవరం ఆర్ జె సి స్థానం లో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈఓ వి. త్రినాథ రావు ను నియమించింది. 

అయితే దేవాదాయ శాఖలో జరిగిన హఠాత్ మార్పుల్లో ముందుగా దుర్గ గుడి

నుంచి తొలగించబడిన ఏం వి సురేష్ బాబు ను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ జె సి గా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు విడుదల అయ్యాయి.  అయితే పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తన ఆదేశాలను మారుస్తూ సురేష్ బాబు కు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ. అదేశాలు జారీ అయ్యాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam