DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో బ్రాహ్మణులు జగన్ కు ఋణపడి ఉన్నారు: కోన రఘుపతి

*గురుమూర్తి ని గెలిపించి జగన్ పట్ల కృతజ్ఞత చాటుకుందాం: కోన* 

*బ్రాహ్మణులకు పూర్వ వైభవాన్ని జగన్ ఇనుమడింప చేసారు: మల్లాది*  

*రూ. 790 కోట్లతో ఈడబ్ల్యుఎస్, త్వరలో అవగాహన నిర్వహణ: మల్లాది* 

*తిరుపతి లో బ్రాహ్మణ సంఘాలతో వైకాపా నేతలు సమావేశం* 

*వైకాపా అభ్యర్థి కోసం ఎన్నికల

ప్రచారం రంగంలో బ్రాహ్మణ నేతలు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి / విశాఖపట్నం, ఏప్రిల్ 10, 2021 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో బ్రాహ్మణులు జగన్ కు ఋణపడి ఉన్నారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యవంలో

శనివారం తిరుపతి లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు - నేడు అందగానే నిలబడ్డారన్నారు. నాటి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి బ్రాహ్మణుడు

ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారన్నారు. 

రాష్ట్రం లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరిపాలన అద్భుతంగా సాగిస్తున్నారు. గత 20 నెలల పాలనలోనే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. బ్రాహ్మణులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి  సందర్భాల్లోనూ గౌరవించారన్నారు. వారి

పట్ల ఏంతో భక్తి కల్గియున్నారని, వారి మనోపభావాలని కాపాడారని రఘుపతి తెలిపారు.  

అతి సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి డా. గురుమూర్తి ని ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టారని, ఈయన్ని అత్యధిక మెజారిటీ తో గెలిపించి, జగన్ వెంటే బ్రాహ్మణులు ఉన్నారని మరో సారి నిరూపిద్దామన్నారు.

  

బ్రాహ్మణుల అభ్యున్నతి కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేసారని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బ్రాహ్మణులకు పూర్వ వైభవాన్ని జగన్ మోహన్ రెడ్డి ఇనుమడింప చేశారన్నారు. 

ప్రతి సందర్భంలోను

బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో సైతం బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాక, వారి గెలుపు భాద్యతను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల సందర్భం లో కూడా తగిన టికెట్లను కేటాయించారన్నారు.

 

అల్పాదాయ బ్రాహ్మణ సామాజిక వర్గాల ప్రతినిధుల ఉజ్వల భవిష్యత్  కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ డబ్ల్యు ఎస్ పథకం అమలులోకి తీసుకు వచ్చారని, ఆ పధకాన్ని బ్రాహ్మణులకు అమలు అయ్యేలా త్వరలోనే అవగాహన ఏర్పాటు చేస్తామన్నారు. బ్రాహ్మణ పేదల కోసం రూ. 790 కోట్ల తో ఈడబ్ల్యుఎస్ నేస్తం ఏర్పాటు చేశారన్నారు. ఈడబ్ల్యుఎస్

నేస్తం పై త్వరలోనే వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఇంచార్జి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఎంతో  గౌరవం ఉన్నాయని, వారికి ఇబ్బంది కలిగే

నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదన్నారు. అతి సామాన్య అర్చకులకు సైతం అండగా నిలిచే ప్రభుత్వం ఇదొక్కటేనన్నారు. వంశపారంపర్య అర్చక విధానాలపై ఎంతో మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. దాని ఫలితంగానే రమణదీక్షితులు సహా ఇతర అర్చకులు కూడా తిరిగి ఆలయ విధుల్లోకి వచ్చారన్నారు.   

ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘాల

ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్,  తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ సంఘాలు, అర్చక, అర్చాకేతర సంఘాలు, పురోహిత సంఘాల ప్రతినిధులతో మాటామంతి నిర్వహించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam