DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అల వైకుంఠ పురంలో 14 అడుగుల విరాట్ వేంకటేశ్వరుడు

*600 ఏళ్ళ చరిత్ర కల్గిన క్షేత్రం సంగారెడ్డి శ్రీ వైకుంఠ పురం*  

*ఆపన్నులను ఆదుకునే అభీష్ట వరదుడు ఈ వేంకటేశ్వరుడు* 

*సాక్షాత్తు శ్రీనివాసునిచే స్వయం సంకల్పిత అభీష్ట సిద్ది క్షేత్రం. .*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 12, 2021 (డిఎన్ఎస్):*

పేరుకు తగినట్టుగానే అల వైకుంఠ పురంలో ప్రపంచంలోనే శ్రీ గోదా మహాలక్ష్మి సమేత అతి పెద్ద విరాట్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి (అభీష్ట సిద్ది క్షేత్రం) ఆలయం (14 అడుగుల మూలవర్లు) ఉన్న ఏకైక క్షేత్రం అత్యంత వైభవంగా విరాజిల్లుతున్న క్షేత్రం సంగారెడ్డి లోని శ్రీవైకుంఠపురం.  

సాక్షాత్తు శ్రీనివాసునిచే స్వయం సంకల్పిత

క్షేత్రం. .

600 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రం ఆవిర్భావానికి సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయం సంకల్పంగా  ఆధారాలు ఉన్నాయి.  క్షేత్ర చరిత్ర ప్రకారం. . .600 సంవస్తసరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన ఒక సాధువు ప్రతి రోజు ఇక్కడ ఉన్న క్షీర గుండం, జల గుండం లో అనుష్ఠాన, స్నానాదులు ఆచరించేవాడు. తనను  దర్శించడానికి వచ్చే

భక్తులకు ఈ ప్రాంతంలో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట అవుతుందని సూచించి ఒక ముహూర్తం నిర్దేశించారు. అయితే ఆ రోజుకు విగ్రహం ప్రతిష్ట అయ్యే ఏర్పాట్లు ఏవీ లేకపోవడంతో భక్తులు సాధువును ప్రశ్నిస్తారు. దీంతో ఏమి సమాధానం చెప్పకుండా సాధువు క్షీర పుష్కరిణిలో స్నానం కోసం దిగుతారు. అయితే ఎంత సేపటికి అయన తిరిగి

రాకుండా, అయన ఉత్తరీయం మాత్రం నీళ్ళపైకి తేలుతుంది. దీంతో భక్తులు జలగుండం లోకి దిగి వెతకడంతో వారికి శ్రీనివాసుని విగ్రహం బయల్పడుతుంది. అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ శ్రీనివాసుడి సాధువు రూపంలో ఈ ప్రాంత వాసులను అనుగ్రహించాడని,, ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుంది. 

కాలాంతరం లో ఆ విగ్రహం భిన్నం

కావడంతో ఆ మూల మూర్తి స్థానం లో అత్యంత వైభవోపేతమైన 14 అడుగుల  ప్రసన్న విరాట్ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠామహోత్సవం  నందన నామ సంవత్సర మాఘ శుద్ద విదియ నుంచి షష్టి  వరకూ ( 2013, ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ )  ఆలయ ప్రతిష్ఠా నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ట మహోత్సవాలు పరమహంస పరివ్రాజకాచార్య, త్రిదండి

శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరిగాయి. 

ఈ ఆలయంలో శ్రీపాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం ఆరాధనలు జరుగుతున్నాయి.  
ఈ ప్రాంగణంలోనే ఉపాలయాలు ఎంతో మహిమాన్వితంగా వెలుగొందుతున్నాయి. మహాలక్ష్మి అమ్మవారు చతుర్బాహువులతో అభయావరద హస్తాలతో, ధన ధన్య వరదాయినిగా శోభిల్లుతూ

భక్తులను అనుగ్రహిస్తోంది. గరుడాళ్వార్ సన్నిధి, మూలవరులకు ఎదురుగా ఉండి భక్తులను పరిరక్షిస్తూ ఉంటుంది. 

గోదా, మహాలక్ష్మి హయగ్రీవ, నరసింహ స్వాముల ప్రత్యక్ష వైభవం ఇక్కడే ఉంది. దక్షిణ ముఖతా శనైశ్చరత దాసాంజనేయుడు క్షేత్ర పాలకుడు ప్రత్యేకత ఎంతో ఉంది. శని దోషాలను పోగొట్టుకునేందుకు ఈ స్వామికి సింధూర సమర్పణ తో

తమాల ఆకుల అర్చన చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

ఆలయానికి చేరుకునే మార్గాలు : 

హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ క్షేత్రానికి కూకట్ పల్లి, చందానగర్, ఇస్నాపూర్, ఉద్రారం, పోతిరెడ్డిపల్లి, అహ్మద్ నగర్ మీదుగా సంగారెడ్డి వరకు బస్ మార్గం ద్వారా చేరుకోవచ్చు. సంగారెడ్డి నుంచి 4 కిలో మీటర్ల దూరం లో

ఉన్న శ్రీవైకుంఠ పురానికి ఆటో ల ద్వారా చేరుకోవచ్చు. 

ఈ ఆలయంలో ఉగాది మొదలు కొని, స్వామి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, నెల రోజుల పాటు ధనుర్మాసోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, సహా అన్ని పర్వదినోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 

అత్యద్భుతం మత్స్య వాహనంలో తెప్పోత్సవం . . . 

క్షీరగుండంలో

స్వామికి జరిగే తెప్పోత్సవం అత్యంత వైభవంగా మత్స్య వాహనంలో నిర్వహించడం మరే ఇతర క్షేత్రాల్లోను దర్శనం ఉండదు. 

వైభవంగా ఉగాది వేడుకలు: . ..  

ఈనెల 13 న ఈ క్షేత్రంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 :30 గంటలకు నింబ కుసుమ భక్షణం ( ఉగాది పచ్చడి) వితరణ, తదుపరి శ్రీ

సీతారామలక్ష్మణులు అభిషేకం, సుందరకాండ పారాయణ, మహాపూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం కందాడై వరదాచార్య స్వామి చే  నూతన సంవత్సర పంచాంగ శ్రవణం జరుగుతుంది.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam