DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి ఆలయంలో ఉడయవర్ ల తిరునక్షత్ర వేడుకలు

*నేటి నుంచి 5 రోజుల పాటు ద్రావిడ ప్రబంధ పారాయణం* 

*18 న భగవద్రామానుజుల తిరునక్షత్ర వైభవ ప్రకటన* 

*ఆలయ అధ్యాపక స్వామి చే ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణ*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2021 (డిఎన్ఎస్):* అస్తవ్యస్తంగా ఉన్న సమాజాన్ని భక్తి

మార్గం ద్వారా ఒక ఉద్యమం నిర్వహించి, విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా కోట్లాది మందికి మార్గదర్శకం చేసిన భగవద్రామానుజుల తిరునక్షత్ర వేడుకలను ఈనెల 14 నుంచి ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా  నిర్వహిస్తున్నట్టు శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం సింహాచలం ఆలయ స్థానాచార్యులు టి పి రాజగోపాల్ తెలియచేసారు. ప్రతి రోజు

సాయంత్రం స్వామి ఆరాధనలు ముగిసిన తదుపరి 7 గంటల నుంచి ద్రావిడ ప్రబంధ పారాయణ ఉంటుందన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఆళ్వార్ల తో పాటు ఆచార్యులుగా ఆరాధనలు అందుకుంటున్న ఉడయవర్ల వైభవాన్ని ప్రకటింప చేస్తూ దివ్య ప్రబంధనాన్ని అనుసంధానం చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదన్నారు.

 ఈ నెల 18 న స్వామి తిరునక్షత్ర ( జన్మదినోత్సవం) ను భక్తులందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.      

సాయంత్రం ఆరాధనలు ముగిసిన తదుపరి అధ్యాపక స్వామి కి శఠారి ఇచ్చి, స్వామి అనుగ్రహం అందించడంతో  వారు ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణ అనుసంధానం చేయడం జరుగుతుంది. 

ఈ వేడుకలను అన్ని శ్రీవైష్ణవ

ఆలయాలల్లోను రామానుజుల తిరునక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 

సింహగిరి క్షేత్రం లో రామానుజుల ప్రవచనం:. . 

భక్తి ఉద్యమాన్ని నలుదిశలా విస్తరింపచేసేందుకు భగవద్రామానుజులు సంచరించిన కాలంలో శ్రీ సింహాద్రి క్షేత్రంలో కొన్ని రోజులు ప్రత్యక్షంగా వేంచేసి, ప్రవచనములు

అనుగ్రహించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయని రాజగోపాల్ తెలియచేసారు. అందుకే ఆలయంలోని ఈశాన్యంలో ఉన్న స్థలానికి హంసమూల అంటారు. పరమహంసలు అనుగ్రహించిన స్థలం అది. అందుకే అత్యంత పవిత్రంగా భావించడం జరుగుతుందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam