DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ నెగటివ్ ఉంటేనే వారణాశి లోకి ప్రవేశం: కలెక్టర్

*మే 3 వరకూ కాశీలో వారాంతాల్లో లాక్ డౌన్ అమలు. . .*

*కొన్నాళ్ళు ప్రయాణం వాయిదా వేస్తె మంచిది: ఆంధ్ర ఆశ్రమం*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 16, 2021 (డిఎన్ఎస్):* భూలోక కైలాసం గా ప్రసిద్ధి కెక్కిన వారణాశి కి వచ్చే యాత్రికులకు ఆ జిల్లా కలెక్టర్ కొన్ని

నిబంధనలను ప్రకటించారు. కరోనా 2 వ dasha తీవ్రతరమవుతున్న తరుణంలో కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితి తగ్గే వరకు వారణాసి యాత్రలు వాయిదా వేసుకోవాలని కోరారు.
 కాశీ విశ్వనాధుడు అన్నపూర్ణ గుడి లో ప్రవేశం కావాలి అంటే మూడు రోజుల క్రిందట covid 19 ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకుంటేనే ఉదయం 7

గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది అని చెప్పారు.

శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం లో. . .

కాశీలోని శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం లో కూడా నిబంధనలు అమలు చేస్తున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వెంకట సుందర శాస్త్రీ తెలిపారు.  కాశీలో కరోనా కేసులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు రెండు వేల పైగా

కేసులు వస్తున్నాయి. పరిస్థితి అంత మంచిగా లేదు. మే  3 వరకూ వారణాశి లో  ప్రతి శనివారము ఆదివారము లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు.  ఈ పరిస్థితుల్లో కాశీకి వచ్చే యాత్రికులు తమ ప్రయాణాలను కొద్దికాలము వాయిదా వేసుకోవాల్సి ఉందిగా కోరుతున్నారు.  
ప్రతి ఒక్కరూ ఈ విషమ పరిస్థితుల్లో నుంచి బయటకు రావాలి అంటే కోవిడ్

 నియమములను పాటిస్తూ మాస్కు పెట్టుకోవటం, రెండు గజాల దూరంలో ఉండటం,  చేతులు కడుక్కోవడం మొదలగు చేస్తూ అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam