DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈసారీ సింహాచలం చందనోత్సవం ఏకాంతమేనా? 

*కరోనా 2 దెబ్బకు భక్తుల ఆశలకు గండి పడతాయా? 

*భక్తుల ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తున్న సింహాచలం దేవస్థానం* 

*సహస్రఘటాభిషేకం కూడా అదేవిధంగానేనా. . .* 

*గత ఏడాది రూల్స్ తప్పిన సిబ్బందిపై చర్యలేవీ?* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం,

ఏప్రిల్ 16, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన  సింహాచల క్షేత్ర శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి చందనోత్సవం గా పిలువబడే నిజరూప దర్శనం ఈ ఏడాది కూడా పూర్తిగా ఏకాంతంలోనే జరుగనుందా అంటే దాదాపుగా అవుననే సంకేతాలే అందుతున్నాయి. కరోనా రెండవ దశ ప్రభావం మరింత తీవ్రంగా అనడంతో  భక్తులకు ఆలయ ప్రవేశం పై నిబంధనలు

విధించే అవకాశం ఉంది. 

ప్రతి ఏడాది ఈ వేడుకలను చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు సింహాచల  క్షేత్రానికి  రావడం జరుగుతుంది. గత ఏడాది  కరోనా ప్రభావంతో భక్తులకు కొండపైకి ప్రవేశాన్ని నిషేదించారు. కేవలం ఏకాంతంలోనే స్వామి వారి కళ్యాణం, తదుపరి చందన యాత్ర ఉత్సవం నిర్వహించారు.   

చందనోత్సవం : .

.

ఏడాది కాలం లో  364 రోజుల పాటు స్వామి పై ఉండే 500 కిలోల చందనాన్ని పూర్తిగా తొలగించి స్వామి ఈ క్షేత్రంలో వెలసిన నిజ రూప దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుంది. సాయంత్రం స్వామికి గంగ ధర నుంచి శ్రీవైష్ణవ స్వాములచె తీసుకు వచ్చిన    1000 కలశల తీర్ధంతో స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది. అనంతరం స్వామికి 125 కిలోల

చందనాన్ని స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఈ వేడుకను చూసి తరించేందుకు దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా రావడం జరుగుతుంది. ఇది ప్రతి ఏడాది జరిగే సంప్రదాయం. 

కరోనా ప్రభావంతో గాత ఏడాది ఈ వేడుకను పూర్తిగా ఏకాంతంలో అర్చకులు మాత్రమే నిర్వహించారు. గత ఏడాది కేవలం ఆలయ చైర్ పర్సన్ సంచయిత మాత్రమే

దర్శనం చేసుకోవాల్సి ఉండగా, ఆమె ఆలయం నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆలయంలో ఒక ఏఈఓ సహా, మరో ముగ్గురు కూడా దర్శనం కోసం అంతరాలయం లోకి వెళ్లడం  జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా దర్శనానికి వెళ్లిన వీళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. 

అయితే దీన్ని తప్పుదారి పట్టించేందుకు తిరుపతి శ్రీను అనే వ్యక్తి

ఆలయంలోకి వెళ్ళడానికి కారణం అంటూ ప్రధాన అర్చకులను దోషిగా నిలబెట్టడం  జరిగింది. తదుపరి మీడియా, భక్తులు రంగంలోకి దిగడంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి  తీసుకోవడం జరిగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam