DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరూ ఉద్దరించబడాలనేదే రామానుజ సిద్ధాంతం: చిన్న జీయర్

*దివ్య సాకేతంలో భగవద్రామానుజుల తిరునక్షత్ర వేడుకలు* 

*216 అడుగుల రామానుజ సమతా మూర్తి సాక్షిగా వేడుకలు*

*చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవోపేతంగా..*  

*ఇరామానుజ నూత్తాందాది పారాయణతో ఓలలాడిన ఆధ్యాత్మికత*    

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, ఏప్రిల్ 18, 2021 (డిఎన్ఎస్):* సమాజం లోని వారందరూ ఉద్దరించబడాలి అనేదే భగవద్రామానుజ సిద్దాంతం, సంప్రదాయమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర రామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. ఆదివారం భగవద్రామానుజుల 1004 తిరునక్షత్ర పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ లోని

ముచ్చింతల్ లోని జీయర్ స్వామి ఆశ్రమం లోని దివ్య సాకేతం క్షేత్రంలో అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా భగవద్రామానుజుల ఆవిర్భావం,  వైభవం, విశిష్టాద్వైత లక్ష్యం, భక్తులందరికీ మోక్షం లభించాలని అనే సంకల్పంతోనే ఆలయ గోపురం పై నుంచి మూల మంత్రం వివరణ తదితర అంశాలను తెలియచేసారు. స్వామికి ప్రత్యేక ఆరాధనలు

అనంతరం తిరువరంగత్త ముదనార్ ఈ లోకానికి అందించిన ఇరామానుజ నూత్తాందాది పారాయణ చిన్న జీయర్ స్వామి స్వయంగా అనుసంధానం  చేశారు. స్వామితో పాటు వేద విద్యార్థులు, శిష్యులు,  ఈ పారాయణ తో ఆశ్రమం ప్రాంగణం రామానుజుల సంకీర్తనతో మారుమ్రోగింది. 
 
216 అడుగుల రామానుజ సమతా మూర్తి సాక్షిగా. . . 

రామానుజాచార్య

స్వామి అవతరించి 1000 సంవత్సరాలు గడిచిన సందర్బంగా చిన్న జీయర్ స్వామి ఒక మహత్తరమైన యజ్ఞాన్ని సంకల్పించారు. భగవద్రామానుజులు ఈ సమాజానికి చేసిన మేలుకు కృతజ్ఞతగా సమతా మూర్తి పేరిట 216 అడుగుల విగ్రహాన్ని నిర్మాణాన్ని ఏర్పాటు చెయ్యాలని 2014 లో సంకల్పించారు. ఇదే ప్రాంగణం లో 108 వైష్ణవ  దివ్య క్షేత్రాల నమూనా ఆలయాలను కూడా

నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. మొత్తం 34 ఎకరాల్లో జరుగుతున్న ఈ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ఈ భూలోక వైకుంఠం ఆవిష్కరణకు నోచుకోనుంది. బంగారం, వెండి, రాగి, కంచు, టైటానియం పంచలోహాలతో తయారవుతున్న ఈ అద్భుత నిర్మాణం త్వరలోనే భక్తులకు దర్శనం అందించనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam