DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి క్షేత్రం పై కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయి లో అమలు

*మాస్క్, శానిటైజేయేషన్, భౌతిక దూరం తప్పని సరి.*     

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2021 (డిఎన్ఎస్):* కొరోనా రాక్షసుడి రెండవ దశ విజృంభణ నేపథ్యంలో శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం, సింహాచలం పై కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ

తెలియచేస్తున్నారు. సోమవారం నుంచి పూర్తిగా నిబంధనలు అమలు లో ఉంటాయని, ఆలయానికి వచ్చే అర్చక, అర్చాకేతర సిబ్బంది సహా భక్తులు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, చేతులు శుభ్రంగా శానిటైజేయేషన్ చేసుకోవాలని, భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలని తెలిపారు. 
భక్తులు, సిబ్బంది కోసం ఆలయ ప్రాంగణంలో చాలా

చోట్ల శానిటైజర్లు పెట్టడం జరిగింది. వాటిని భక్తులు ఉపయోగించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.  ఇప్పటికే భక్తులను ఎండ వేడిమినుంచి ఉపసమనం కోసం టెంట్లు , వైట్ పెయింట్ వేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. మాస్కు ధరించడంతోపాటు - భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి

చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam