DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లంచం కేసుల్లో దొరికితే వందరోజుల్లో క్రమశిక్షణ చర్యలు 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 19, 2021  (డిఎన్ఎస్):* అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై వందరోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు క్రమశిక్షణ చర్యలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పక్కా ఆధారాలతో దొరికిన వారిపై

చర్యలు తీసుకోవాలని శాఖలను ఆదేశించింది. వందరోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అవినీతి నిరోధక శాఖ డీజీ, శాఖల ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 1995 నుంచి 2020వరకు మొత్తం 1,686 కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 476 అవినీతి కేసులే

ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam