DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏప్రిల్ 20 నుంచి అరకు లోయలో స్వచ్ఛంద లాక్ డౌన్

వర్తక, వ్యాపార, పౌర సంక్షేమ సంఘం నిర్ణయం :

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2021 (డిఎన్ఎస్):* ఈ నెల 20 (మంగళవారం) నుంచి పర్యాటక కేంద్రమైన అరకులోయలో 'ఆఫ్ డే' స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించడానికి వర్తక, వ్యాపార,పౌర సంక్షేమ సంఘం నిర్ణయించింది.  కరోనా విజృంభిస్తున్న

నేపథ్యంలో ఈ మేరకు అరకులోయలోని గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి  పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన అత్యవసర సమావేశంలో వర్తక సంఘం ప్రతినిధులు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు  వ్యాపారులు అందరూ కలిసి స్వచ్ఛంద లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. 
పర్యాటక కేంద్రమైన అరకులోయను కరోనా నుంచి

కాపాడాలని, ఆరోగ్యకరమైన అరకు లోయ గా తయారుచేయడానికి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి తమ వంతు కృషి చేయడంలో భాగంగా స్వచ్ఛంద  లాక్ డౌన్ అవసరమని వర్తక సంఘం ప్రతినిధులు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు  20 నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ కు ఏకగ్రీవంగా

తీర్మానం చేశారు. 
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత పాటించాలన్న సంకల్పంతో గత ఏడాది కూడా పౌర సంక్షేమ సంఘం, వర్తక సంఘం ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 2020  జూన్ నెలనుంచి జూలై నెల వరకు  ఆప్ డే స్వచ్ఛంద లాక్ డౌన్ ను సుదీర్ఘ కాలం పాటు చేసిన విషయం తెలిసిందే. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam