DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో 10 వ తరగతి, ఇంటర్ పరీక్షలు యధాతథం 

*స్కూళ్లల్లో మిగిలిన తరగతులకు రేపటి నుంచి సెలవులు*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 19, 2021  (డిఎన్ఎస్):* రాష్ట్రంలో 10 వ తరగతి, ఇంటర్ పరీక్షలు యధాతథం గా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, స్కూళ్ల ల్లో 1 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకూ సెలవులు ప్రకటిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారని, రాబోయే రోజుల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి క్లాసులను

రద్దు చేస్తున్నామని.. వారందరికీ మంగళవారం నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. వాటి షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని... ప్రస్తుతానికి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులను భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా

నిబంధనలను అనుసరిస్తూ... నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో కోవిద్ కేసులు పెరిగిన నేపథ్యంలో చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam