DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భద్రాచలంలో 19 నుంచి అంతరాలయం సేవలు రద్దు

*20 న ఎదుర్కోలు, 21 న కళ్యాణం, 22 పట్టాభిషేకం ఏకాంతమే*

*కరోనా 2 వేవ్ ప్రభావంతో నిబంధనలు అమలు లోకి: ఈఓ  *

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 19, 2021  (డిఎన్ఎస్):* రెండవ దశ కరోనా మరింత విజృంభిస్తున్నందున ఈ నెల 19 నుంచి అంతరాలయం సేవలు, పూజలను రద్దు చేస్తున్నట్టు భద్రాచలం

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఈఓ తెలిపారు. కేవలం భక్తులకు ఉచిత, శీఘ్ర దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని, తీర్ధ ప్రసాద, శఠారి కూడా ఇవ్వడం ఉండదన్నారు. ఈ నిబంధనలు ఈ నెల 30 వరకూ అమలు లో ఉంటాయన్నారు. 

ఈ నెల 20 నుంచి జరుగవలసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ  ఉత్సవాలు పూర్తిగా ఏకాంతంలో

జరుగుతున్నట్టు ఆలయ ఈఓ తెలియచేసారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసారు.
ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈ నెల 20 న ఎదుర్కోలు ఉత్సవం జరగాల్సి ఉంది. 21 న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తీరు కల్యాణ మహోత్సవం, 22 న జరగవలసిన స్వామి వారి మహా పట్టాభిషేకం ఏకాంతంలోనే, కేవలం ఆంతరంగిక సిబ్బంది సమక్షంలో జరుగుతుందని

తెలిపారు.
భక్తులు ఈ వేడుకల్లో ప్రవేశం లేదని తెలిపారు. భక్తుల ఆరోగ్యం ను దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ ఉత్సవాలను మీడియా ద్వారా ప్రత్యక్ష  ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. ఇదే నిబంధనలు ఆలయ అనుబంధ దేవాలయమైన పర్ణశాలలో కూడా అమలు లో ఉంటాయన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam