DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొరోనా రాక్షసునిపై యుద్ధం లో హిందూ దేవాలయాలు సైతం 

*కొరోనా వైద్యశాలగా మారిన స్వామినారాయణ్ దేవాలయం*

*దేవాలయంలో 300 బెడ్స్ లో పేషంట్లు, మరో 200 కి ఏర్పాట్లు*  

*వైద్య సిబ్బందికి, ప్రత్యేక గదులు, మెడికల్స్ స్టోర్స్ ఏర్పాటు*

*అందరికి స్వయంగా వండి వడ్డిస్తున్న స్వామి నారాయణ ఆలయం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, ఏప్రిల్ 21, 2021 (డిఎన్ఎస్):* కొరోనా రాక్షసునిపై యుద్ధం లో హిందూ దేవాలయాలు సైతం నడుంబిగించాయి. కొరోనా రెండవ దశ మరింతగా విజృంభిస్తున్న తరుణంలో గుజరాత్ లోని వడోదర లో గల ఆట్లాడరా లో ఉన్న బిఏపిఎస్ శ్రీ స్వామి నారాయణ దేవాలయం నిర్వాహకులు తమ దేవాలయాన్ని కోవిడ్ పేషంట్లకు చికిత్స కోసం వైద్య శాలగా

మార్చేశారు. ప్రసుతం 300 పడకలతో అందుబాటులో గత వారం నుంచి నడుస్తోంది. మరో 200 పడకల ను సిద్ధం, చేస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ నిర్వాహకులు జ్ఞాన్ వత్సల్ స్వామి తెలియచేసారు. సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయంలో పేషంట్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు, వైద్య సిబ్బంది, సహకార సిబ్బందికి

వేర్వేరు గదులు ఇవ్వడమే కాక, మెడికల్ మందుల సదుపాయం కోసం మెడికల్ స్టోర్స్ ను కూడా పూర్తి మందుల నిల్వలతో అందుబాటు లో ఉంచారు. జ్ఞాన్ జి వందస్ జి స్వామి ఆధ్వర్యవం లో కరోనా పేషేంట్లకు పూజారులు, సాధువులు సేవలు అందిస్తున్నారు. 

గత ఏడాది, కొరోనా మొదటి దశ లో పుట్టపర్తి కి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ

సత్యసాయి సేవా ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ పరికరాలను, మాస్క్ లను, శానిటైజర్లను అందించడమే కాక, ప్రత్యేకంగా ఒక వైద్య ఆసుపత్రిని సైతం నెలకొల్పారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam