DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాదు, ఇప్పుడు అందరికీ దిక్కు

*విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైలు, వాగన్లలో ఆక్సిజన్ సరఫరా* 

*2700 మెట్రిక్ టన్నుల ఉదజని నిల్వ చేసుకునే సామర్ధ్యం* 

*దేశ ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న స్టీల్ కార్మికులు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2021 (డిఎన్ఎస్):* కొరోనా

రాక్షసుని విలయతాండవానికి విలవిలా లాడుతున్న భారతావనికి ఆశాదీపంగా నిలిచింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే అనే ఉద్యమ నినాదం తో ఏర్పాటు అయ్యినప్పడికి, ప్రస్తుతం భయంకర పరిస్థితిలో భారత దేశానికి అందరికీ దిక్కు అయ్యింది. ఈ ప్లాంట్ లో స్టీల్ ఉత్పత్తిలో భాగంగా ఆక్సిజన్ కూడా ఉత్పత్తి అవుతుంది.

ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక రోజుకి 100 మెట్రిక్ టన్నుల ఉదజని ఉత్పత్తి అవుతోంది. మొత్తం 2700 మెట్రిక్ టన్నుల ఉదజని నిల్వ చేసుకునే సామర్ధ్యం విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉంది. ఈ ఉక్కు పరిశ్రమ కేంద్రం పరిధిలో ఉండడంతో, ఇక్కడ ఉత్పత్తి అవుతున్న ఉదజని ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలనీ కేంద్రం ఏర్పాటు

చేస్తోంది. ఈ రాష్ట్రంలో తయారైన ఆక్సిజన్ లో ఆంధ్రాకి అధిక భాగం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 
ప్రస్తుతం మహారాష్ట్ర లో పరిస్థితి అదుపు తప్పే విధంగా ఉండడంతో ప్రత్యేకంగా ముంబై నుంచి ఆక్సిజన్ రైల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గురువారం తెల్లవారుఝామున చేరుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్

నుంచి రైలు లోని ట్యాంకర్లలోనూ, వాగన్లలో ఆక్సిజన్ నింపుకుని తిరిగి బయలు దేరింది.  

ఇప్పడికే అధిక మొత్తంలో ఉదజని నిల్వలు స్టీల్ ప్లాంట్ లో ఉండడంతో వాటిని వాగన్ల ద్వారా ముంబై, మహారాష్ట్రకు తక్షణం తరలిస్తున్నారు. ప్రత్యేక రైలు ముంబై నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చిన ఆక్సిజన్ రైల్ లోని ట్యాంకర్లలో ఉదజని

నింపడంతో పాటు, వాగన్ల ద్వారా కూడా ఉదజని సిలెండర్లను సరఫరా చేస్తున్నారు.  

ప్రస్తుతం భారత దేశంలో కొరోనా విజృంభణ నుంచి ప్రజలను రక్షించుకునేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, అధిక మొత్తం లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. 

ఉక్కు ఉత్పత్తిలో ఆక్సిజన్ , నైట్రోజన్,

ఆర్గాన్ వాయువులు చాలా కీలకం. - 173 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువ స్థాయిలో క్రయోజనిక్ ఎయిర్ సప్రెషన్ విధానం లో గాలి నుంచి వాయువులను వేరు చేస్తారు. - 83 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ వేరు పడుతుంది. అది వాయు రూపంలో ఉంటుంది. దాన్ని ద్రవరూపంలోకి మార్చి, 99 శాతం పూర్తి స్థాయి లో సిద్ధం చేస్తారు. గంటకు సాధారణ 1 లక్ష ఘనపు మీటర్ల

గాలిని ప్రాసెస్ చేస్తే 13 500 నుంచి 18 500 ఘనపు మీటర్ల ద్రవ రూప ఉదజని ఉత్పత్తి అవుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam