DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రిలో గోవులకు విచిత్ర వ్యాధి, కలకలం..!!

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 22, 2021  (డిఎన్ఎస్):*  రాజమహేంద్రవరం లోని నారాయణపురం లో ఒక ప్రైవేటు పశువుల శాల లో ని గోవులకు అంతుచిక్కని అంటువ్యాధి సోకడంతో తీవ్ర కలకలం చెలరేగింది. అంతుచిక్కని అంటువ్యాధి తో విలవిలాడుతున్న
మూగజీవాల వేదనను కళ్లారా చూసిన రాజమహేంద్రవరం

ఎంపీ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేసి పశుసంవర్ధక శాఖ అధికారులను రప్పించి వైద్య పరీక్షలకు ఆదేశించారు.

ఆవులకు చోకిన వింత అంటువ్యాధికి సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత పశువుల నుంచి సేకరించిన శాంపుల్స్‌ను విజయవాడలోని వైరాలజీ ల్యాబ్‌కు

తరలించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ వెల్లడించారు.

నగరంలోని నారాయణపురం ప్రాంతంలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన పశువుల కొట్టంలో ఆవులపై యాసిడ్‌ దాడి జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ

మార్గాని భరత్‌ రామ్‌ గురువారం సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా సంబంధిత పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్, వైద్యులు డాక్టర్‌ వేణుగోపారావు, ఏడి రమేష్ చంద్ర, వెటర్నరీ డాక్టర్ లోకేష్ సమక్షంలో  సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. 

పశువులపై నిజంగానే యాసిడ్‌ దాడి జరిగిందా? లేకా

మరేదైన వ్యాధి శోకిందా? అనే దానిపై ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఆరా తీశారు. దీనిపై సంబంధిత పశువుల యజమానులతో ను, స్థానికులు తోను ఆయన భేటీ అయ్యారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam