DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటాలాడదు:మంత్రి కన్నా 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 23, 2021  (డిఎన్ఎస్):* రాష్ట్రంలో కరోనా మరణాలు విపరీతంగా పెరిగాయని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో ఎదో జరిగిపోతున్నట్లుగా భయాందోళనలను కలిగించడం సరికాదన్నారు. ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వం

పరీక్షలు, నివేదికలను పారదర్శకంగా వెల్లడిస్తుందన్నారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రేపు కరోనాపై సీఎం జగన్ సమీక్షిస్తారని .. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

‘‘కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు

తీసుకుంటుంది. మరణాలను దాస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేయడం సరికాదు. పది, ఇంటర్ తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారని ప్రభుత్వం భావించింది. పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కష్టమని భావిస్తే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఉపాధ్యాయులు, పిల్లల

ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడదు. కొవిడ్‌ పరిస్థితులను ఆసరాగా తీసుకుని అధికంగా వసూలు చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam