DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐవిఎల్ సంగీత జనకులం ఉచిత శిక్షణ శిబిరం వాయిదా

*కరోనా ప్రభావం తగ్గాక కొనసాగింపు: శిక్షకులు కాళీప్రసాద్* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్  24, 2021 (డిఎన్ఎస్):* గత కొన్ని దశాబ్దాలుగా విశాఖ నగర పరిధిలో వేలాది మంది సంగీత శిక్షణను ఉచితంగా అందిస్తూ సంగీత సరస్వతికి గాన నీరాజనం అందిస్తున్న ఐవిఎల్ సంగీత

జనకులం రేపటి నుంచి ఆరంభించవలసిన ఉచిత సంగీత శిక్షణ శిబిరం ఎంపికలు వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు కాళీ ప్రసాద్ తెలియచేసారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన శిక్ష శిబిరం ఎంపికలు వాయిదా వేస్తున్నట్టు వివరించారు. కరోనా ప్రభావం తగ్గినా తదుపరి శిబిరం తిరిగి

కొనసాగుతుందన్నారు.  

విశాఖ త్యాగరాజు ఐవిఎల్. . .

ప్రముఖ సంగీత విద్వాన్సులు విశాఖ అభినవ త్యాగరాజస్వామిగా కీర్తి గాంచిన కులపతి ఐవిఎల్ శాస్త్రి నెలకొల్పిన ఈ సంగీత జనకులంలో అయన సంగీత వారసుల సారధ్యంలో నేటికీ సంగీత యజ్ఞం కొనసాగుతోంది. వీరి సారధ్యంలో వేలాది మంది ఔత్సాహికులు సంగీత సాధనలో శిక్షణ

పొందారు. నేటికీ ఎందరో సంప్రదాయ సంగీత గాయకులకు ఈ సంగీత జనకులం తో అనుబంధం ఉండి ఉంటుంది. 

ఏడాది, రెండేళ్ల కోర్సులు. . ..

కర్ణాటక సంగీతములో ఉచితముగా శిక్షణ ఇచ్చుటకు ఒక సంవత్సరం సంగీత అవగాహన కోర్సు, రెండు సంవత్సరముల భక్తి సంగీతం కోర్సుల్లో నూతన తరగతులను సంగీత జనకులం ప్రారంభిస్తున్నట్టు

సంగీతజనకులం.అధ్యక్షుడు, ఇంద్రగంటి కాళీ ప్రసాద్, తెలియచేస్తున్నారు. ఈ  తరగతులను ప్రముఖ సంగీత విద్వాన్సులు ఇంద్రగంటి కాళీ ప్రసాద్, ఇంద్రగంటి రమణి ప్రసాద్ ల సారధ్యం లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 
శిక్షణ లో పాల్గొనదలచిన విద్యార్థులకు ఈ నెల 25 వ తేదీ ఆదివారం జరగవలసి ఉంది. వీటినే వాయిదా వేయడం

జరిగింది. 

అవగాహనా కోర్సు :

ఒక సంవత్సరం కాలం సంగీత అవగాహన కోర్సు ( Music Appreciation Course) ప్రతి ఆదివారం ఉదయం 6:30 గంటల నుండి 8.30 గంటల వరకు విశాఖపట్నం లోని రామ్ నగర్ లో గల  శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం లో శిక్షణ ఇవ్వబడును. ఇందులో త్యాగరాజస్వామి రచనలు, శాస్త్రీయ సంగీత రాగములు తాళములు మొదలగు అంశములు, శాస్త్రీయ సంగీత

కచేరీలు అవగాహన చేసుకొను విషయములు నేర్పించడం జరుగుతుంది. 

రెండేళ్ల భక్తి సంగీతం కోర్సు: . . .

రెండు సంవత్సరముల భక్తి సంగీతం కోర్సు లో తరగతులు వారంలో మూడు రోజులు జరుగనున్నాయి. ఈ భక్తి సంగీతం తరగతులలో  త్యాగరాజ స్వామి, అన్నమాచార్య, రామదాసు, కబీరుదాసు, మీరాబాయి మొదలగు వాగ్గేయకారుల కీర్తనలతో పాటు

కులపతి శ్రీ ఐ వి యల్ శాస్త్రి గారు రచించిన "సంగీత రత్నావళి" నుండి సంకీర్తనలు కూడా నేర్పబడును.  ఈ తరగతులు ఈ క్రింది విధముగా ప్రారంభించబడును.

1. ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు ఏంజెల్స్ ఎనక్లేవ్ , జగద్గురు పీఠం, 15-7-1, కృష్ణా నగర్, విశాఖపట్నం -21 నందు జరుగును. 

2. ప్రతి బుధ వారం ఉదయం 9:00 గంటల

నుండి 11:00 గంటల వరకు  మాష్టర్ హోమియో వైద్యాలయం, 45-42-9, పాతపోస్టు ఆఫిసు రోడ్ , అక్కయ్యపాలెం, విశాఖపట్నం -16 నందు జరుగును.  

3. ప్రతి శనివారం ఉదయం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు మాష్టర్ హోమియో వైద్యాలయం, 45-42-9, పాతపోస్టు ఆఫిసు రోడ్ , అక్కయ్యపాలెం, విశాఖపట్నం -16 నందు జరుగును. 

ముఖ్య గమనిక

1. రెండు సంవత్సరముల

భక్తి సంగీతం కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారికి మౌఖిక పరీక్ష నిర్వహించి, ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సంగీత శిక్షణ ఇవ్వబడును.

2. అన్ని మతముల వారు, అన్ని కులముల వారు, అన్ని వయసుల వారు ప్రవేశమునకు అర్హులు.

3. ఈ తరగతులన్నియూ సంగీతం పట్ల భక్తి శ్రద్ధలతో అభ్యసించవలెనన్న ఆసక్తి గల వారి కొరకై

ఉచితముగా నిర్వహించబడుచున్నవి. క్రమము తప్పకుండా తరగతులకు హాజరగుట మరియు కోర్సు పూర్తి కాలము అభ్యసించుట విద్యార్ధి యొక్క బాధ్యత. 

4. విద్యార్థులు అందరూ సంగీతజనకులం యొక్క  నియమ నిబంధనలను విధిగా పాటించవలెను.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam