DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత న్యాయాధీశునిగా జస్టిస్ NV రమణ ప్రమాణ స్వీకారం

*సి జె ఐ గా భాద్యతలు చేపట్టి రెండవ ఆంధ్రుడు ఈయనే*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2021 (డిఎన్ఎస్):* భారత దేశ సర్వోన్నత న్యాయాధీశునిగా   జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈయనతో భారత దేశ 48 వ సుప్రీం కోర్టు ప్రధాన

న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవి కాలం ముగియడం తో అయన తన తదుపరి సి జె ఐ గా జస్టిస్ రమణ పేరు ను ఖరారు చేయడం, ఆ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగస్టు 26 వరకు 16 నెలలపాటు సీజేఐగా

కొనసాగుతారు.

జస్టిస్ రమణ నేపథ్యం

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ రమణ జన్మించారు.  ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నుంచి 1982 లో న్యాయశాస్త్రం లో పట్టా పొందారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యులు గా చేరి

కొంతకాలం న్యాయ సేవలు అందించారు అనంతరం హైకోర్టు లో న్యాయవాది గా సభ్యత్వం తీసుకొని పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వం కి న్యాయవాదిగా పని చేశారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు

చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam