DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశాంతినిలయంలో వైభవంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు

*సామాన్యునిగా అవతరించి. .అసామాన్యునిగా ఆవిర్భవించి* 

*పుట్టపర్తి ని ప్రపంచ పటంపై నిలిపిన మహనీయులు. .*

*శివైక్యం చెందినా అయన సంకల్పం నిత్య నూతన ప్రకాశమే*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2021 (డిఎన్ఎస్):* సత్యనారాయణ రాజు అనే మహనీయుడు

అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామం లో ఆవతరించకపోతే. . ఆ పేరు ప్రక్క గ్రామానికే తెలిసి ఉండేది కాదేమో. అయితే ఆ సామాన్య సత్యనారాయణ రాజు కేవలం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన బృహత్తర కార్యాచరణ ద్వారా అసామాన్యునిగా ఆవిర్భవించి. . .సత్యసాయి బాబా గా  ప్రపంచ దేశాలకూ ఆదర్శంగా నిలిచారు. 

పుట్టపర్తి గ్రామం లోని

ప్రశాంతి నిలయం నుంచి అయన చేపట్టిన ప్రతి కార్యక్రమం విశ్వఖ్యాతం అయ్యింది. విద్య, వైద్యం, సామాజిక సేవ తో పాటు, త్రాగునీరు, సాగు నీటికి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకు సత్యసాయి మంచినీటి పధకం ద్వారా వారి అవసరాలను తీర్చారు.   

ఆయన తన జీవన సంకల్పాన్ని నెరవేర్చి, శివైక్యం చెందినా నేటికీ అయన సంకల్పం దేశ విదేశాల్లో

నిత్య నూతనంగా ప్రకాశింపబడుతోంది. ఏప్రిల్ 24 న ఆయన తన భౌతికంగా అవతార సమాప్తి చేసిన రోజు కావడంతో దేశ విదేశాల్లోని భక్తులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఆయన ఆరాధనోత్సవాలు ప్రశాంతి నిలయం లో శ్రీ సత్య సాయి ఆరాధన మహోత్సవం వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం సాయి పంచరత్న అనేది ఒక సాంప్రదాయం.

ప్రసిద్ధ త్యాగరాజ పంచరత్న సంప్రదాయంలో రూపొందించిన సాయి పంచరత్న కృతిలు, పేరుకు తగినట్టు సూచించినట్లుగా, ఐదు వేర్వేరు రాగాలకు ఐదు సంగీత రత్నాల సంకలనం అందించారు. అన్ని పాటలను సత్య సాయి మీర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ యొక్క డాక్టర్ ఆర్ వసంతలక్ష్మి సమకూర్చారు, సంగీతాన్ని చెన్నైకి చెందిన  రాజ్ కుమార్ భారతి

స్వరపరిచారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam