DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరాహ లక్ష్మీ నృసింహుని చందనోత్సవానికి సింహగిరి పై ఏర్పాట్లు 

*శ్రీ చందనం చెక్కలతో అర్చక, సహకార సిబ్బంది సిద్ధం. 

*మే 14 న సింహాచల క్షేత్ర స్వామి నిజరూప దర్శనం, ఏకాంతంలోనే*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 05, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి

వారి నిజరూప దర్శనం ( చందనోత్సవం ) ఈనెల 14వ తేదీన జరగబోతోంది. దీనికై పూర్వరంగం కోసం అర్చక సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమై యున్నారు. ఏడాది పాటు 500 కిలోల చందనంతో అలంకరించబడి ఉండే స్వామి నిజరూప దర్శనం కేవలం వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ తృతీయ) నాడు ఒక్క రోజు  మాత్రమే లభిస్తుంది. అనంతరం స్వామికి 3 మణుగుల ( 125 కిలోల) చందనం, సహస్ర

ఘట్టాభిషేకం అనంతరం స్వామికి సమర్పించడం జరుగుతుంది. దీనికోసం చందనం చెక్కలను, అరగతీత రాళ్లను ఇప్పడికే సిద్ధం చేసారు. చందన సమర్పణ నిమిత్తం స్వామివారం భండారం  నుంచి చందనం కర్రలు తీసుకుని, చందనం తీయడానికి అనుకూలంగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తయారుచేయడమైనది. అరగదీతకు అనుకూలంగా  శుభ్రపరిచారు. చందనం సాన ముహూర్తి 7వ

తేదీ...  అప్పటి నుంచి చందనం తీయడం ఆరంభమవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించనున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్వామి నిజరూప దర్శనం పూర్తిగా ఏకాంతంలోనే జరుగనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam