DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై చందనం అరగతీత వేడుక ఉత్సవం ఆరంభం.

*మే 14 న సింహాచల క్షేత్రం లో చందనోత్సవం, ఏకాంతమే* 

*వరాహలక్ష్మి నృసింహుని నిజరూపం దర్శనం భక్తులకు లేదు*  

*గత ఏడాది కూడా ఏకాంతంలోనే, ఇతరుల ప్రవేశంతో గొడవ*

*ప్రధానార్చకుని పై వేటు తో మొదలై ఈఓ బదిలీ తో ముగిసింది*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మే 07, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి నిజరూప దర్శన వేడుకల ఆరంభం ఘట్టం శుక్రవారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యింది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచల క్షేత్ర ఆలయంలో శుక్రవారం ఉదయం దేవాలయంలో

వేకువజామునే స్వామికి సుప్రభాత సేవ, ఆరాధన, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం పూర్వాచారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలను తీసి, శ్రీ పాంచరాత్ర ఆగమ వైదిక సంప్రదాయం ప్రకారం బేడా మండపం చుట్టూ తిరిగి చందన సాన దగ్గర విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాల

కృష్ణమాచార్యులు ఆధ్వర్యవంలో సుముహుర్తానికి చందన సాన పై చందనం అరగదీత సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది.
     చందనం తీసే కార్యక్రమాన్ని ఈఓ సూర్యకళగారు , స్థానాచార్యులు డా. రాజగోపాలాచార్యులు గారు, అలంకారి కరి సీతారామాచార్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ఐదారు రోజులపాటు కొనసాగనుంది. ప్రతిరోజు... ఉదయం 5 గంటల

నుంచి చందనం తీయడాం జరుగుతుంది.
    ఈ నెల 14న స్వామివారి నిజరూప దర్శనం జరిగిన తదుపరి గంగాధర నుంచి తీసుకు వచ్చిన వెయ్యి కలశల గంగాధర తీర్ధం తో స్వామికి సహస్రఘట్టాభిషేకం సైతం ekantamlo నిర్వహించనున్నారు. తదుపరి స్వామివారికి మూడు మణుగుల చందన సమర్పణ నిర్వహిస్తారు. 

వైశాఖ పౌర్ణమినాడు రెండో విడత, జేష్ట

పౌర్ణమినాడు మూడో విడత, ఆషాడ పౌర్ణమినాడు నాలుగో విడత చందన సమర్పణ చేస్తారు.

గత ఏడాది గొడవతో ప్రధానార్చకుని పై వేటు, ఈఓ బదిలీ. ..   

గత ఏడాది కూడా చందనోత్సవం ఏకాంతం లో నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈఓ ప్రకటించినప్పడికి, ఆలయానికి సంబంధం లేనివారు, ఆలయ సిబ్బంది (ఉన్నత హోదాల్లో ఉన్నవారే) నిబంధనలను తుంగలోకి

తొక్కుతూ, స్థానాచార్యులు వారిస్తున్నా సరే  గర్భాలయ ప్రవేశం చెయ్యడం చాల వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం వారింకా ఆలయంలోనే విధులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోక పోగా ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ ను అకారణంగా సస్పెండ్ చేస్తూ నాటి ఈఓ తీసుకున్న నిర్ణయం మరింత వివాదంగా మారింది. ఈ ఘటన నాటి ఈఓ ను

బదిలీ చేసే వరకూ దారితీసింది.

ఈ పర్యాయం కూడా చందనోత్సవం ఏకాంతం అనే ప్రకటన చేయడంతో ఈసారి ఇంకే వివాదం వస్తుందో తెలియని స్థితినెలకొంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam