DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలంలో ఆరు రోజులు భక్తులకు దర్శనాలుండవు

*మే 10 నుంచి 15 వరకూ భక్తులకు కొండపైకి అనుమతి లేదు* 

*14 న చందన యాత్ర పూర్తి ఏకాంతమే, ఈఓ సూర్యకళ*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 07, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల

14న స్వామివారి నిజరూప దర్శనం సందర్బంగా ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలుండవు. అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయంలో భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేయాలని ఈఓ ఎంవి సూర్యకళ నిర్ణయించారు. 

ఏడాదిలోనే అతి పెద్ద ఉత్సవం ఇది అని, చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష

మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యేం దృష్యా ఈ నిర్ణయం తీసుకోవడమైనది. 

భక్తులకు అనుమతిలేకపోయినా, స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే జరపబడుతున్నాయి. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదు. మే 10 నుంచి 15 వరకు భక్తులెవరూ సింహాచలం

కొండపైకి రాకూడదని విజ్ఞప్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ఇదే తరహా నిర్ణయాలు తీసుకోవడమైనదని, అందరూ సహకరించాలని ఈఓ సూర్యకళ కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam