DNS Media | Latest News, Breaking News And Update In Telugu

AP పాలకులారా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై స్పందించండి

*మూతపడిన పరిశ్రమల్లో ఆక్సిజన్ తయారీకి ప్లాన్ చెయ్యాలి*    

*రాయితీలు ఇస్తే. .నడిపేందుకు సంస్థలు ముందుకు వస్తాయి* 

*వేలాది మందికి ఉపాధి, లక్షలాదిమందికి జీవం లభిస్తుంది.*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 07, 2021 (డిఎన్ఎస్):* ప్రస్తుతం ఆంధ్ర

ప్రదేశ్ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మూతపడిన పరిశ్రమల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఆయా సంస్థలకు ఆర్ధిక సహకారం చేస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది, లక్షలాది మంది ప్రజలకు జీవం లభిస్తుంది. ఈ విధమైన ఆలోచన ప్రభుత్వం, పాలకులు ఎందుకు చెయ్యడం లేదు అనే సందేహాలు

కలుగుతున్నాయి. ఇది ఒక విపత్కర పరిస్థితి దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభత్వాలకు సమాజంలోని అన్ని వర్గాలు సహకారం అందిస్తాయి. గతంలో VSEZ ల్లో ఎన్నో సంస్థలు నెలకొల్పారు, APIIC ద్వారా పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. auto nagar లు vachayi. ప్రభుత్వాల సహకారం లేక,  వీటిల్లో వందలాది సంస్థలు ప్రతి జిల్లాలోనూ మూతపడ్డాయి. ప్రభుత్వాల సహకారం లేక

ప్రతి జిల్లాలోనూ ఇంకా మూతపడేందుకు ఎన్నో సిద్ధంగా ఉన్నాయి.  వాటిని తిరిగి జీవం పొసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే. . .ప్రతి జిల్లాలోని ప్రజల అవసరాలు తీరతాయి.  

అలా ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు నెలకొల్పి, ప్రస్తుత అవసరాలకు అండగా నిలబడవలసి భాద్యత ప్రభుత్వాలపై ఉంది. 

గత

పాలకులు చేసిన తప్పుల్ని ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దితే. . .వెలది మందికి ఉపాధి దొరుకుంటూ, లక్షలాది మంది జీవం (ఆక్సిజన్ ) లభిస్తుంది. 

ఈ తరహా ఆలోచనలు ప్రభుత్వాలు, MP, MLA లు ఎందుకు చెయ్యడం లేదు. 
ఈ పాలకులకు ఇదొక మంచి అవకాశం, ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడితే. . . మరో 30 ఏళ్ళు అధికారం లో ఉండే అవకాశం ఉంది.

ఇదే

జరిగితే కేవలం మన రాష్ట్ర avasarale కాకా, ఇతర ప్రాంతాల అవసరాలు కూడా భర్తీ చెయ్యవచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam