DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొరోనా నుంచి భారతావనిని కాపాడు సింహాద్రి నాథా:గంట్ల

*చందనస్వామి సేవలో ఆలయ ఆహ్వానితులు శ్రీనుబాబు* 

*స్వామికి 3 కిలోల చందన సమర్పణకై శ్రీనుబాబు విరాళం*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 08, 2021 (డిఎన్ఎస్):* ఈ కొరోనా రాక్షసుని బారి నుంచి యావత్ భారతావనిని రక్షించమని భక్తులందరి తరపున స్వామిని

ప్రార్ధించవలసిందిగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం, సింహాచలం అర్చక శ్రేష్ఠులను ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు కోరారు.  
ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ

నృసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 14 న  స్వామివారి నిజరూప దర్శనం సందర్బంగా స్వామివారికి శ్రీనుబాబు దంపతులు 3 కిలోల చందన సమర్పణ చేసేందుకు శనివారం ఆలయానికి వచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆలయానికి అత్యంత ప్రధాన మైనవారు అర్చకులు మాత్రమేనని, అందుకే స్వామి నిజరూప దర్శనం వారికి మాత్రమే

లభిస్తోందన్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 14 న  స్వామివారి నిజరూప దర్శనం సందర్బంగా చందన సమర్పణ లో భక్తుల భాగస్వామ్యం విస్తృతంగా లభిస్తోంది. స్వామిని ప్రత్యక్షంగా సేవించే అవకాశం లేనందున స్వామి కి జరిగే

కైంకర్యాల్లో ఇతోధికంగా భక్తులు పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే గంట్ల శ్రీనుబాబు దంపతులు శనివారం మూడు కిలోల చందన సమర్పణకు నిధులు అందించారు. ఏడాదిలో 364 రోజుల పాటు పూర్తి చందన రూపుడై దర్శనమిచ్చే సింహాద్రినాధుడు వైశాఖ శుద్ధ తృతీయ ( అక్ష తదియ) రోజున మాత్రం పూర్తి నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈ స్వామిని

దర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. 

ప్రస్తుతం కొరోనా ప్రభావం కారణంగా ఈ ఉత్సవం పూర్తిగా ఏకాంతంలోనే జరుగనుంది. గత ఏడాది కూడా స్వామి దర్శనం భక్తులు ఎవ్వరికి లభించలేదు. దీంతో సింహాద్రి నాధుడు చందన ప్రసాదం సమర్పణకు భక్తుల నుంచి ఆలయ వర్గాలు విరాళాలు కోరుతున్నాయి. 

ఆలయ

ప్రతినిధుల పిలుపు మేరకు  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు శనివారం స్వామిని దర్శించుకుని మూడు కేజీలు చందన సమర్పణకు విరాళం అందజేశారు. దీనికి సంబంధించిన మొత్తం రూ. 60,348 చెక్ రూపములో ఆలయ  ఏఈఓ రాఘవ కుమార్ కు అందజేశారు. 

అందరి సహకారముతో ఉత్సవాలు

శ్రీ పాంచరాత్ర ఆగమోక్తంగా, మరింత వైభవోపేతంగా జరుగుతాయని శ్రీను బాబు అన్నారు. 

ఈ కార్య క్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఆలయ పురోహితులు అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవ్ లోచన, సూపరెండెంట్ దాసరి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam