DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కాన్వెంట్ జంక్షన్ పేరును తుమ్మెదలమెట్టగా మార్చాలి 

*నగర మేయర్ ను కోరిన సింహాచలం ఆలయ స్థానాచార్యులు* 

*తురుష్కులను తుమ్మెదల రూపంలో వాయ్ కొట్టిన సింహాద్రి నాధుడు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 9, 2021, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంద్ర జిల్లాల ఇలవేల్పుగా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ

స్వామి క్షేత్ర పురాణం చారిత్రక ఆధారాల మేరకు విశాఖ నగరంలోని కాన్వెంట్ జంక్షన్ కు తుమ్మెదల మెట్ట అని పేరు ఉండేదని సింహాచల స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ తెలియచేసారు. ఆదివారం సింహాచలం క్షేత్రాన్ని దర్శించుకున్న విశాఖపట్నం నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి కి సింహాచల మహత్యాన్ని, ఆలయ చరిత్రని ఈయన

వివరించారు.  

18వ శతాబ్దం తొలిభాగంలో తురుష్కులు హిందూ దేవాలయాలపై దాడి చేసిన సందర్భంలో సింహాచలం ఆలయంపైనా దాడికి వచ్చారని, నిధుల కోసం  దేవాలయంలోకి ప్రవేశించి శిల్పకళలను ధ్వంసం చేశారని తెలిపారు. ఆ దుర్ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను మేయర్ కి చూపించడం జరిగింది. చివరికి స్వామివారు తనను తాను కాపాడుకోవడానికి

 భారీ  తుమ్మెదల రూపంలో బయలు దేరి తురుష్కుల మూకను తుమ్మెదల మెట్ట ( ప్రస్తుతం కాన్వెంటు కూడలి ) వరకు తరిమి కొట్టారని ఆలయ చరిత్ర చెబుతోంది. నిన్న మొన్నటివరకు ప్రస్తుత కాన్వెంట్ కూడలిని తుమ్మెదల మెట్టని పిలిచేవారు. అయితే కాల క్రమేణా ఆ పేరు పోయి...  కాన్వెంట్ జంక్షన్ అని పిలుస్తున్నారు. అందుకే కాన్వెంట్ జంక్షన్ ను...

తుమ్మెదల మెట్టగా నామకరణం చేసి... అక్కడ స్వామివారి జ్ఞాపకార్థం బోర్డు పెట్టాలని ... ఆ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం ఇప్పటి యువతకు చెప్పాలని స్థానాచార్యులు కోరగా... ఈ దిశగా తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తామని మేయర్ హామీనిచ్చారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam