DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రినాధుని కి సహస్ర ఘటాభిషేకం సేవ ఆలయ అర్చకులతోనే 

*సింహాచలం లో మే 14 న వరాహ లక్ష్మి నృసింహుని నిజరూప దర్శనం*

*చందనోత్సవం వేడుకల్లో సహస్ర ఘటాభిషేకమే అత్యంత ప్రాధాన్యం*
 
*ఒక్కో కలశ తో తీర్ధం గంగాధర నుంచి తీసుకు వచ్చే అవకాశం లేదా?* 

*గంగాధర నుంచి కాకుండా ఆలయం నుంచి ఘటాభిషేకం జరుగుతుందా?*

*కొరోనా కష్టకాలంలో దేవాలయ ఆగమ ప్రత్యామ్నాయం

తప్పదా?*  

*శ్రీవైష్ణవ స్వాముల శోభాయాత్ర, నామస్మరణా గోష్టి ఈసారీ అవకాశం లేదు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 10 , 2021, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంద్ర జిల్లాల ఇలవేల్పుగా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చందనోత్సవం

సందర్భంగా (14వ తేదీ) నిజరూప దర్శనం చేసుకున్నతర్వాత సాయంత్రం స్వామివారికి జరిగే సహస్ర ఘట్టాభిషేకాన్నీ కేవలం దేవాలయ అర్చకులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ అపురూపమైన వేడుకను నిర్వహించేందుకు వందలాదిగా శ్రీవైష్ణవ స్వాములు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంప్రదాయం. గత ఏడాది నుంచి ఈ

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొరోనా రాక్షసుని ప్రభావంతో భక్తులకు ఆలయ ప్రవేశం ను రద్దు చేయడం జరిగింది. దీంతో ఈ సహస్ర ఘటాభిషేకం వేడుకను కేవలం ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈమారు కూడా సహస్రఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నట్టు ఆలయ అలంకారి కరి సీతారామాచార్యులు

తెలియచేస్తున్నారు. ఇప్పడికే ఆలయంలోనే వెయ్యి మట్టి కలశాలను సిద్ధం చేసారు. 

సంప్రదాయం లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. .. 

శ్రీ పాంచరాత్ర ఆగమ విధానం లో నిర్వహించే శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం లో స్వామికి నిజరూప దర్శనం అనంతరం జరిగే ఘటాభిషేకం జలాన్ని కొండపైన ఉన్న పవిత్ర గంగాధర

నుంచే ప్రతి కలశ ను తీర్ధాన్ని పట్టుకుని, ఆలయంలో మూలవిరాట్ నిజరూపాన్ని అభిషేకం చేయడం జరుగుతుంది. 
అష్టోత్తర కలశ స్నపనం తర్వాత పంచామృతములతో సహస్ర ఘటములతో గంగధార తీర్థంతో స్వామివారికి అత్యంత వైభవంగా తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అష్టోత్తర కలశ స్నపనం తర్వాత పంచామృతములతో సహస్ర ఘటములతో గంగధార తీర్థంతో

స్వామివారికి అత్యంత వైభవంగా తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఈ కలశాలను సాంప్రదాయ పరులైన శ్రీవైష్ణవ స్వాములు వేదపారాయణం చేసుకుంటూ గర్భాలయంలోకి భారీ శోభాయాత్రగా తీసుకురావడం జరుగుతుంది. 

ఈ పర్యాయం కొరోనా ప్రభావం తో స్వాములు ఈ క్షేత్రానికి వచ్చే పరిస్థితి లేనందున ఆలయ అర్చకులు దీనికి తగిన

ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గంగాధర నుంచే భారీ గంగలాలతో జలాన్ని ముందుగానే తీసుకు వచ్చి ఆలయంలో పవిత్ర స్థలం లో నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉంది. సాయంత్రం స్వామికి ఈ గంగలాల నుంచి జలాన్ని మట్టి కలశాల్లో నింపు గర్భాలయం లో అభిషేకం చేయడం జరిగి అవకాశం ఉంది. అయితే ఎలా నిర్వహిస్తునారు అనే విషయం చెప్పనప్పడికి,

ప్రతీ కలశ తో జలాన్ని గంగాధర నుంచి తీసుకు వచ్చే అవకాశం అయితే కనపడడం లేదు.  

స్వామికి నిర్వహించే అర్చనలు ఏకాంతంలో జరిపే అవకాశం ఉన్నప్పడికి, ఘటాభిషేకానికి మాత్రం ప్రత్యామ్నాయాన్ని కచ్చితంగా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam