DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందనోత్సవానికి సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం 

*చందనంలో సుగంధ ద్రవ్యాల సమ్మిళితం 3 మణుగులు సిద్ధం*

*విశాఖపట్నం, మే 12, 2021 (డిఎన్ఎస్):* ఈ నెల 14వ తేదీన అత్యంత వైభవంగా జరుగనున్న శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాచలం) నిజరూప దర్శన చందనోత్సవం కోసం తగిన వైదిక ఏర్పాట్లను పూర్తి చేసారు. గత ఐదు రోజులుగా చందనం అరగదీత పూర్తయినది. బుధవారం చందనంలో సుగంధ ద్రవ్యాలను

మిళితం చేయడమైనది. తర్వాత సుగంధ చందనాన్ని శ్రీవారి భాండాగారంలో భద్రపరచడమైనది. ఈ ప్రక్రియను ఈఓ సూర్యకళ, ఏఈవో రాఘవకుమార్, స్థానాచార్యులు డా. టీపీ రాజగోపాల్, ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు, అలంకారి సీతారామాచార్యులు పర్యవేక్షించారు. 14వ తేదీన నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి సహస్ర ఘట్టాభిషేకం జరుగును. అనంతరం

తొలివిడత చందన సమర్పణ స్వామివారికి జరుగుతుంది.

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి చందనోత్సవం సందర్భంగా ... దశావతార పూర్ణకలశం తిరుపతి వాస్తవ్యులు కె. నారసింహం-  విజయలక్ష్మీ మాధవి దంపతులు సమర్పించారు. ఈ దశావతార కలశను ప్రత్యేకంగా తయారు చేయించారు.  స్వామివారి అభిషేకానికి దీన్ని ఉపయోగించనున్నారు.
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam