DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహద్రినాథుని నిజరూప దర్శనం ఇద్దరికే: ఈఓ సూర్యకళ  

*ఆలయ చైర్మన్, మంత్రి కి మాత్రమే దర్శన అనుమతి.* 

*సింహాచలం చందనోత్సవం పూర్తిగా ఏకాంతమే..*

*అందరి తరపున అర్చకులు ఆరాధనలు నిర్వహిస్తారు.*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 12, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాలల ఇలవేల్పు గా కొనియాడబడుతున్న శ్రీ వరాహ

లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం సింహాచలం ఆలయంలో ఈ నెల 14వ తేదీన చందనోత్సవం నాడు స్వామి దర్శనం కేవలం ఇద్దరికే లభిస్తుందని ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలిపారు. మిగిలిన ఆరాధనలు, అర్చనలు పూర్తిగా ఏకాంతంలోనే జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు కోవిడ్ నిబంధనల వల్ల ఏకాంతంగానే ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 
/> ఏడాది పొడవునా సుగంధ చందనంలో ఉండే స్వామి ఒక్క చందనోత్సవంనాడే  నిజరూప దర్శనమివ్వనున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం తొలి దర్శనం ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి కి కల్పించనున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి  స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.  

దురదృష్టమైన కోవిడ్ కారణాల నేపథ్యంలో

 మిగతావారికి 14వ తేదీన కొండపైకి అనుమతి ఉండదని గమనించగలరు. చందనయాత్ర నిర్వహణకు అవసరమయ్యే ఆలయ ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక పాసులతో కొండపైకి అనుమతించనున్నాము. 
ట్రస్టు బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు సైతం చందనోత్సవం రోజు అనుమతి లేదు. మీడియాకు, మీడియా ప్రతినిధులకు కూడా కొండపైకి అనుమతిలేదు. ప్రభుత్వ

ఆదేశాలమేరకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడమైనదన్నారు. 

చందనోత్సవ ప్రధాన ఘట్టాలను (కళ్యాణమండపం) లైవ్ లో చూసే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. లక్షలాదిమంది ప్రత్యక్షంగా పాల్గొనే చందనయాత్ర ... ఏకాంతంగా నిర్వహించాల్సిరావడం బాధాకరమే. కోవిడ్ మహమ్మారి దూరమై... వచ్చే ఏడాదైనా భక్తులతో కలకలలాడేలా ఉత్సవాన్ని

జరుపుకునేలా చేయాలని ఆ సింహాద్రినాథుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam