DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు సింహాచల కమిటీ సభ్యుని ఆర్థిక సాయం 

*రూ.1.60 లక్షలు అందించిన జాతీయ సంఘం కార్యదర్శి*    

*జర్నలిస్టులను వారియర్స్ గా గుర్తించాలి: గంట్ల శ్రీనుబాబు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 13, 2021 (డిఎన్ఎస్):* సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం అని, శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం

సింహాచలం దేవస్థాన ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు కొనియాడారు. నగరంలో పలువురు జర్నలిస్టులకు తన సొంత నిధులతో రూ 1.60 లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు చెప్పారు. 
ఈ మేరకు గురువారం అక్కయ్యపాలెం లో  రంజాన్ పర్వదినం సందర్బంగా 15 మంది (ముస్లిం)

జర్నలిస్టులకు  30 వేల రూపాయలు  శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ క్రమం తప్పకుండా పదేళ్లుగా ప్రతియేటా రంజాన్ పర్వదినం సందర్భంగా  జర్నలిస్టుల కు తనవంతు  సహాయం వారికి అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన జర్నలిస్ట్ మిత్రుల తో పాటు చిన్న పత్రికలు,

వీడియో, ఫోటో జర్నలిస్ట్ లకు తన వంతు సహయం దశల వారీగా  అందిస్తున్నట్లు చెప్పారు. ఒక నిరుపేద కుటుంబానికి రూ. 60,000, .ఇద్దరు చిన్న పత్రిక ల ఎడిటర్ లుకు పదివేలు చొప్పున కూడా అందజేయడం జరిగిందన్నారు.  ఇది ప్రచారం కోసం కాదని, మరికొందరు స్పూర్తి గా తీసుకొని నిరుపేద జర్నలిస్ట్ లుకు అండగా నిలుస్తారని భావిస్తున్నట్లు

చెప్పారు. 
గత ఏడాది కరోనా సమయం లో సుమారు రూ. 12 లక్షలు వరకు వివిధ వర్గాలకు వేర్వేరు రూపాల్లో సహాయం అందచేశానన్నారు. అప్పట్లోకేవలం నిత్యా వసర వస్తువులు కోసమే రూ.  8 లక్షలు ఖర్చు చెయ్యడం జరిగిందన్నారు. నిరంతరం ప్రజా సేవలో కొనసాగుతున్న జర్నలిస్ట్ లును ప్రభుత్వం ఆడుకోవాలని..అన్ని సదుపాయాలు కల్పించాలని శ్రీనుబాబు

కోరారు. కరోనా సమయంలోజర్నలిస్ట్ లు ఫ్రంట్ లైన్ వర్కర్స్ రూపములో నిరంతరం ప్రజలు కోసం పాటు పడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో పలువురు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam