DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందన యాత్ర లో ఆలయంలో కఠిన నిబంధనలు అమలు 

*13 నుంచి 15 వరకూ విధులు అర్చకులు కొండపైనే ఉండాలి* 

*అర్చనల్లో 11 మందికి, ఘటాభిషేకం 10 మందికే అనుమతి*

*గత ఏడాది లా తప్పిదాలు రాకుండా పగడ్బంది ఏర్పాట్లు.* 

*సిబ్బంది వెంట మొబైల్స్ కు అనుమతి లేదు : ఈఓ సూర్యకళ

*విఐపిలు, ట్రస్టీలు, విలేకరులు ఎవరు వచ్చినా చర్యలకు సై !!*  

*(DNS

రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 13, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు గా కొనియాడబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం సింహాచలం ఆలయంలో ఈ నెల 14వ తేదీన చందనోత్సవం వేడుకల్లో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఆలయ పరిధిలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ చందన యాత్ర

విధుల్లో ఉన్న అర్చక, అర్చక సహాయక, వేదపండిత తదితర వైదిక సిబ్బంది అందరూ కచ్చితంగా ఈ నెల 13 ఉదయం 8 గంటల నుంచే 15 వ తేదీ ఉదయం వరకూ సింహగిరి కొండపైనే బసచేసి ఉండాలని ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ ఆదేశాలు జారీచేశారు. స్వామికి జరగవలసిన సేవల్లో ఎటువంటి లోటు రాకుండా, అవాంతరాలు లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరు మాత్రమే

కొండపైకి రావాలని, వీరితో వీరి కుటుంబ సభ్యులు, బంధువులు రాకూడదన్నారు. విధుల్లోకి వచ్చే సమయంలో వీరి వెంట మొబైల్స్ కూడా తీసుకు రాకూడని ఆదేశాలు జారీ చేసారు. 

ఈ ఏడాది స్వామి దర్శనానికి ఎవ్వరికి అనుమతి లేదని, ఈ నిబంధనలు అతిక్రమించి, విఐపిలు, బోర్డు సభ్యులు, విలేకరులు ఎవరు వచ్చినా, తక్షణం ఈఓ తో సంప్రదించి చర్యలు

తీసుకోవాలని ఆదేశాలు జారీ చెయ్యడం గమనార్హం. గత ఏడాది లా తప్పిదాలు రాకుండా పగడ్బంది ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.  

అర్చక  సిబ్బంది కి కేటాయించిన విధులు ఇవే :

ఏ షిఫ్ట్ లో : 11 మంది అర్చకులకు విధులు కేటాయించారు.  వీరు సుప్రభాతం, నిర్మల్య విసర్జన, అంతరాలయం శుద్ధి, ఆరాధనా, చందనోత్తరణ, అభిషేకం,

అలంకారం. ఈ నెల 14 న ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ విధులు ఉంటాయి.
 
బి షిఫ్ట్ లో : 10 మంది వైదిక అర్చకులు ఉంటారు. 1000 కలశాల ఏర్పాట్లు, గంగాధర నుంచి జలం తీసుకు వచ్చుట. స్నపనానికి తగిన ఏర్పాట్లు సాయంత్రం ఘటాభిషేకం, శీతల నివేదన, పవళింపు వరకూ రాత్రి 11 గంటల వరకూ విధులు. 

అధ్యాపకులు సిబ్బంది :

ఏ షిఫ్ట్

లో  4 గురు, బి షిఫ్ట్ లో  ముగ్గురు  విధుల్లో ఉంటారు. స్థానాచార్యులు పర్యవేక్షణలో అన్ని పారాయణాలు జరుగుతాయి.

వేదపండితులు : 

ఏ షిఫ్ట్ లో 4 గురు ఋగ్వేద, సామవేదం, అధర్వణ వేదం పారాయణం. బి షిఫ్ట్ లో  ముగ్గురు విధుల్లో ఉంటారు. వీరు ఋగ్వేద, శుక్ల యజుర్వేదం సామవేద పారాయణం

అనుసంధానిస్తారు.

తలిహం లో : ఏ షిఫ్ట్ లో  6 గురు, బి షిఫ్ట్ లో 5 గురు సిబ్బంది విధుల్లో ఉంటారు. 

ఇక సెక్యూరిటీ విధుల్లో 20 మంది, ఎలక్ట్రికల్ విభాగం లో  ఇద్దరు, స్టోర్స్ లో 4 గురు, అన్న ప్రసాద విభాగం లో 4 గురు, రిసెప్షన్ లో 4 గురికి మాత్రమే విధులు కేటాయించడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam