DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగమ ప్రకారంగా సింహాద్రినాధుని చందన యాత్ర

*ఇద్దరికే ఆలయ మర్యాదలతో అధికారిక దర్శనం..* 

*విఐపిలు, భక్తులకు, సిబ్బంది కి కూడా దర్శనాలు బంద్* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 14, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు గా కొనియాడబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం సింహాచలం ఆలయంలో

స్వామి నిజరూప దర్శనం ( చందనోత్సవం ) ఏకాంతంగా శ్రీపాంచరాత్ర ఆగమ విషణం ప్రకారం నిర్వహించారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం నిర్మల్య విసర్జన, అంతరాలయం శుద్ధి, పుణ్యాహవచనం తదుపరి, ఆరాధనా, చందనోత్తరణ, అభిషేకం, అలంకారం చేపట్టారు. ఈ విధుల్లో ఉదయం ఏ షిఫ్ట్ లో 11 మంది అర్చకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఇతర

కైంకర్యాల్లో మరో 10 మంది అర్చక సిబ్బంది పాల్గొన్నారు. వీరు సాయంత్రం జరుగనున్న 1000 కలశల ఏర్పాట్లు, గంగాధర నుంచి జలం తీసుకు వచ్చుట. స్నపనానికి తగిన ఏర్పాట్లు సాయంత్రం ఘటాభిషేకం, శీతల నివేదన, పవళింపు వరకూ రాత్రి 11 గంటల వరకూ విధుల్లో కొనసాగనున్నారు. 

స్వామి నుంచి చందన విసర్జన చేసిన తదుపరి, ఆ అద్భుత ప్రసాదాన్ని

అర్చక స్వాములు, వేదపండితుల శిరస్సుపై ఉంచారు.   
అనంతరం ఆలయ అనువంశిక ధర్మ కర్త గా కొనసాగుతున్న సంచయిత గజపతి స్వామి తొలిదర్శనం చేసుకున్నారు. ఆమె వెంట ఆలయ ఈఓ సూర్యకళ కూడా ఉన్నారు. 

తదుపరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ స్వామికి నూతన వస్త్రాలు

సమర్పించారు. 

కొరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా విఐపిలు, ఆలయ ట్రస్ట్ కమిటీలు, భక్తులు, ఎవ్వరికి స్వామి దర్శనం లభించలేదు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam