DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఆలయంలో వైదిక ఆచారాలకు పట్టింపు లేదా?

*అపచారం జరిగితే భాద్యులు ఎవరు?  అర్చకులా లేక సిబ్బందా? 

*స్వాములకు ఆచారం చెప్పే వైదిక సిబ్బందికి తెలియదా?* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 14, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు గా కొనియాడబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం

సింహాచలం ఆలయంలో వైదిక అర్చకులు చెప్పిందే ఆచారం అన్నట్టుగా సాగుతోంది అనే అభిప్రాయాలూ భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. 

జుట్టు విప్పుకుని ధర్మకర్త ఆలయ ప్రవేశం చెయ్యడం పట్ల పలువురు సంప్రదాయపరులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 
ధర్మకర్త వెంట ఆలయ ఈఓ సూర్యకళ, స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన

అర్చకులు గోపాలకృష్ణ, అలంకారి భండారి సీతారాం లు కూడా ఉండడం గమనార్హం. పైగా వీరెవ్వరూ అభ్యంతరం చెప్పినట్టుగా కనపడలేదు.   

శుక్రవారం జరిగిన స్వామి నిజరూప దర్శనం ( చందనోత్సవం ) ఏకాంతంగా శ్రీపాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. 
అయితే కొరోనా ప్రభావం కారణం కేవలం ధర్మకర్తకు మాత్రమే స్వామి దర్శనం

అనుమతి ఇచ్చారు. ఈ ఆలయ ధర్మకర్త మహిళ కావడం, పైగా అవివాహిత కావడం గమనార్హం. వీరికి హిందూ సంప్రదాయం తెలియకపోవచ్చు. అయితే వారికి సమ్పరాయడాన్ని తెలియచేసాల్సిన భాద్యత ఆలయ వైదిక సిబ్బంది ( స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, పురోహితులు / అలంకారి, భండారి), ఆలయ ఈఓ లపై ఉంటుంది. 

జుట్టు విప్పుకుని మహిళలు ప్రవేశించరాదు:.

.. 

హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు ( వివాహితులైనా, అవివాహితులైనా) జుట్టు విప్పుకుని ఆలయ ప్రవేశం చెయ్యరాదు. ఇది పెద్దలు ప్రతి సారీ తెలియచేసే విషయం. ఈ విషయం ప్రతి ఆలయంలోని అర్చక, వైదిక సిబ్బందికి కచ్చితంగా తెలుస్తుంది. 

శుక్రవారం సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజ రూప

దర్శనానికి వచ్చిన ధర్మకర్త జుట్టు విప్పుకుని ( అల్లుకోవడం లేదా ముడి కూడా లేకుండా ) ఆలయ ప్రవేశం చెయ్యడమే కాకుండా, స్వామి ని తోలి దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో ఈమె వెంట ఆలయ ఈఓ ( ఈమె కూడా మహిళే ) ఉండడం గమనార్హం. అయితే ధర్మకర్త కు ఆలయ సంప్రదాయం చెప్పాల్సిన వైదిక సిబ్బంది గానీ, ఆమె వెంటే ఉన్న ఈఓ ( ఈమె జుట్టు ముడి వేసుకురావడం

గమనార్హం) గానీ ఎటువంటి అభ్యన్తరం చెయ్యక పోవడం గమనార్హం. 

ఇది పూర్తి గా ఆలయ సంప్రదాయానికి విరుద్ధమని సంప్రదాయ వాదులు 
అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ధర్మకర్తకు తెలియక పోవచ్చని, అయితే వారికి చెప్పవలసిన భాద్యత అర్చక సిబ్బంది పై ఉందని, అర్చక సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం ఈ విషయాన్నీ ఆలయ ఈఓ ద్వారా

చెప్పాల్సి ఉందన్నారు. ఈరోజు జరిగిన ఘటన లో దోషం పూర్తిగా ఆలయ సిబ్బందిదే అన్నట్టు తెలుస్తోంది. వారు సూచించినట్టయితే ధర్మకర్త కచ్చితంగా పాటించి ఉండేవారని, ఒకవేళ సిబ్బంది చెప్పినా వినకపోతే దోషం వారిదే అవుతుందన్నారు. 

ఏది ఏమైనా జుట్టు విప్పుకుని ఆలయ ప్రవేశం చేయడం దోషంగానే కనపడుతోందన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam