DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళ అధికారుల పర్యవేక్షణలో వైభవంగా చందనయాత్ర 

*శాస్త్రోక్తంగా సింహాద్రినాధుని నిజరూప దర్శన వేడుక*

*సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: సింహాచలం ఆలయ ఈఓ*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 15, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి

వారి నిజరూప దర్శన మహోత్సవం వైభవోపేతంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించడంలో ఇద్దరు మహిళల పాత్ర ప్రధానం గా కనపడుతోంది. కొరోనా ప్రభావంగా గత ఏడాది కూడా చందనయాత్ర ఏకాంతంలో జరిగినప్పడికే కొన్ని ఘటనల కారణంగా దేవస్థానం ప్రతిష్ఠా కొంత భంగపాటుకు గురైంది. 

అయితే ఈ ఏడాది కూడా ఇదే కొరోనా పరిస్థితులు

ఉన్నప్పటికీ, చందనయాత్ర శ్రీ పాంచరాత్ర ఆగమోక్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైభవంగా నిర్వహించడంలో ఇద్దరు మహిళలు ప్రధాన భూమిక వహించారు. వారిలో ఒకరు ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ, రెండవ వారు ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి. వీరిద్దరి సహకారంతో, సూచనలతో ఆలయ వైదిక సిబ్బంది ప్రశాంతంగా వైదిక కార్యాచరణను నిర్వహించారు. 
వైదిక

సిబ్బంది తప్ప, ఇతరులు ఎవ్వరూ ఆలయ ధ్వజ స్థంభం దాటి లోకి లోపాలకి వేళ్ళని విధంగా కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైదిక సిబ్బంది లో కూడా అవసరం మేరకు మాత్రమే సిబ్బందికి విధులు నిర్వహించడం జరిగింది. ఆలయ ట్రస్టీలు, వీఐపీలు, సహా మీడియా వారికి కూడా ఆలయ ప్రవేశం కల్పించకుండా పూర్తి నిబంధనలను  అమలు

చేయగలిగారు. ఈ మేరకు నిబంధనలకు లోబడి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ ఈఓ ధన్యవాదాలు తెలియచేసారు. 

సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటె. . .స్వామి దర్శనం కోసం వీరిద్దరిపై ఎంత ఒత్తిడి ఉండి వుండేదో ఊహించడం కష్టతరం. 

ఒకటి, రెండు తప్పిదాలు ద్రొల్లి ఉన్నా, మొత్తం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం లో

వీరిద్దరి పాత్ర అభినందనీయం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam