DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇవి హిందూ దేవాలయాలా ... లేక ధర్మ సత్రాలా?: విహెచ్పి మండిపాటు

*హిందూ ఆలయాలపై ప్రభుత్వ ఆధిపత్యం పై విమర్శలు*  

*హిందూ గుళ్లను కమ్యూనిటీ కేంద్రాలుగా మారుస్తారా?* 
 
*దర్శనాలు బంద్, ఈ హుండీల ద్వారా ముడుపుల సేకరణ* 

*గుళ్లల్లో కోవిడ్ కేంద్రాల ఏర్పాటుపై పూడిపెద్ది శర్మ మండిపాటు*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మే 18, 2021 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రభుత్వానికి, పాలకులకు హిందూ ఆలయాలు ధర్మ సత్రాల్లాగా కనపడుతున్నాయా అని విశ్వహిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపడ్డారు.  ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం పట్ల హిందూ ధార్మిక సమాజం,

భక్తులు అభ్యంతరం చెప్పినప్పడికి ప్రభుత్వం మొండి వైఖరితో ఈ నిర్ణయం తీసుకోవడం పై మండిపడుతున్నారు. 

సనాతన హిందూ ధర్మం లో దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నాయని, అవి పూర్తి ఆధ్యాత్మికపరంగా ఉన్నతంగా ఉంటాయన్నారు. సంప్రదాయం, మడి, ఆచారం, నిష్ఠ ఇక్కడ అతి ముఖ్యం. అంట్లు, ముట్లు, మరణాలు అయితే దేవాలయం

అపవిత్రమౌతుంది. తద్వారా దేవాలయ వ్యవస్థే పూర్తిగా దెబ్బతింటుందన్నారు.  

ఇప్పడికే హిందూ దేవాలయాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని భక్తుల నుంచి కోట్లాది రూపాయలు టికెట్లు, ప్రసాదాలు, అన్నదానం, ఆర్జిత సేవల పేరిట వసూళ్లు చేస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా దేవాలయాలకు ఎప్పుడు

పెట్టుబడి పెట్టలేదని, పైగా ఒక్కో దేవాలయం నుంచి లక్షలు, కోట్ల రూపాయలు దోచుకు పోతుందన్నారు.  తద్వారా  ఈ నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం , దేవాదాయ శాఖా తీసుకున్న నిర్ణయం హిందూ దేవాలయ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసేదిగా ఉందని ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చాలి అంటూ చర్యలు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వానికి లోకువగా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇతర మాటలకూ చెందిన ఎన్నో భవనాలు, పెద్ద ప్రాంగణాలు ఉన్నా, వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఎందుకు

చెయ్యడం లేదని ప్రశ్నిస్తున్నారు.   

ఇప్పడికే కోవిడ్ నిబంధనల పేరుతొ ఆలయాల్లో భక్తులపై పూర్తి నిషేధాలు పెట్టారని, భక్తులకు ప్రవేశాలు బందు చేసి, ముడుపులు, కానుకలు, మొక్కుబడులను ఈ హుండీ ల పేరుతొ పూర్తిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీనికి తోడు ఏకంగా ఆలయాల పరిసరాలను కోవిడ్ కేంద్రాలుగా మార్చడమంటే

ప్రభుత్వానికి, పాలకులకు హిందూ ఆలయాలు ధర్మ సత్రాల్లాగా కనపడుతున్నాయా అని ప్రశ్నిస్తున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam