DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్యుల చెంతకే చౌక దుకాణ సౌకర్యాలు : ప్రత్తిపాటి పుల్లారావు

విశాఖపట్నం, జులై27 , 2018 (DNS Online ):  à°¸à°¾à°®à°¾à°¨à±à°¯à±à°² కు అవసరమయ్యే సౌకర్యాలను వారి చెంతకే లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల

శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య

పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలను సెప్టెంబర్ నుంచి అన్ని చౌక దుకాణాల ద్వారా కిలో రూపాయికే అందించనున్నట్టు తెలిపారు.

ప్రతి కార్డుకు బియ్యం కు బదులుగా  3 కిలోలు చొప్పునకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారుల డిమాండ్ ను బట్టి అవసరం మేరకు కొత్త పెంచడం జారుతుందన్నారు. అన్ని

రేషన్ షాపుల్లోనూ డీలర్ల పై ప్రజలకు నమ్మకం కలిగే విధం గా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పడికే వై ఎస్ ఆర్ కడప, విజయవాడ జోన్ ల్లో ఈ సమావేశాలు

జరిగాయని, శుక్రవారం విశాఖపట్నం లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రేషన్ డీలర్ల కు ఈ అవగాహనా సదస్సు జరుగుతోందన్నారు.

తూకాలు, కొలతలు, గ్యాస్ సిలండర్ బరువు, పెట్రోల్ బంక్ ల్లో ఎప్పడికప్పుడు విస్తృత తనిఖీలు చేయడం ద్వారా చాలా వరకు కంట్రోల్  à°šà±‡à°¯à°¡à°‚ జరిగిందన్నారు. పెట్రోల్

బంకుల్లో డ్యూయల్ సిమ్ సిస్టం ను తీసివేసి బటన్ నొక్కే విధానం మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. అవకతవకలకు పాల్పడుతున్న నలుగురు  à°ªà±†à°Ÿà±à°°à±‹à°²à± బంకుల నిర్వాహకులపై

చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. షాపింగ్ మాల్స్, ఐమాక్స్ సినిమా ధియేయేటర్లు తదితర షాపుల్లో తినుబండారాలను ఎం ఆర్ పి ( జీఎస్టీ తో కలిపి) ధరల కన్నా అధిక ధరకు

అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం జారుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  2 లక్షల 35 వేల కార్డులను

అదనంగా కలపడం జరిగిందన్నారు. కందిపప్పును à°’à°• కేజీ అదనంగా పెంచి, ప్రస్తుతం రెండు కేజీల వరకూ రేషన్ దుకాణం ద్వారా ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే  à°ªà°¾à°¯à°¿à°‚ట్ల నుంచి

రేషన్ డీలర్ల నేరుగా సరుకులను తెచ్చుకునే విధంగా ఆదేశం ఇవ్వడం జరిగిందని, తూకాల్లో తేడా వస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలే ప్రారంభించిన

అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడుస్తున్నాయని కితాబిచ్చారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు వస్తాయన్నారు. అనంతరం మంత్రి ఎం ఆర్పీ కి ( జీఎస్టీ

తో కలిపి)   అధిక ధరలకు మించి అమ్మరాదు అని తెలిపే 1100 టోల్ à°«à°¿ నెంబర్ పోస్టర్ ను విడుదల చేశారు. à°ˆ పోస్టర్ ను అన్ని వాణిజ్య వ్యాపార సంస్థల్లోనూ, ఐమాక్స్ దియేటర్లలోనూ,

షాపింగ్ మాల్స్ లోనూ ప్రదర్శించనున్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో పౌర సరఫరాల శాఖ సంచాలకులు జి. రవిబాబు, తూనికలు కొలతల శాఖ ఐ జి రంగనాధ స్వామి, ఇతర అధికారులు

పాల్గొన్నారు. 

 

#TDP #Telugudesam #Telugu Desam #Andhrapradesh  #Ganta #Srinivas #DNS #Vizag #Visakhapatnam #Civil supplies #Ration #DNSLIVE  #News #Rationshop #Prattipati #Government 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam