DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగింపు?

*కరోనా నిబంధనల మధ్య పంపిణీ జరిగే అవకాశం.*

*చెడు ప్రభావం లేనందునే ముందడుగుకు సూచనలు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 20, 2021 (డిఎన్ఎస్):* నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ

జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ కి

ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియచేసారు. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది. ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి

కనబరుస్తున్నారు. కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించారు. 
రేపటి నుండి అనగా తేది: 21- 05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam