DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆయుర్వేద మందు కోసం కృష్ణపట్నంలో జన సందోహం

*రాత్రి నుంచే కృష్ణపట్నం చేరుతున్న ప్రక్క రాష్టాల జనం*

*ఆపన్నహస్తుడు ఆనందయ్య ఎదుట ఆసరా కోసం వేలాదిమంది* 

*ముందుగా పాజిటివ్ ఉన్నవారికి మందు ఇస్తాం: ఆనందయ్య*  

*అదుపు చేసే ప్రయత్నాల్లో పొలిసు బలగాలు ఇబ్బంది*  

*నెల్లూరు మీడియా వాహనాలు కూడా కృష్ణపట్నం కె. . .*

*(DNS

రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 21, 2021 (డిఎన్ఎస్):* కొరోనా రాక్షసునికి అడ్డుకట్ట వేస్తున్న  ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం వేలాది గా ప్రజలు  నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం చేరుకుంటున్నారు. కొన్ని అభ్యంతరాల అనంతరం  శుక్రవారం నుంచి మందు జరుగుతుండడంతో ఆంధ్ర ప్రదేశ్

నుంచే కాకా, ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు, బాధితులు వేలాదిగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో వాహనాల రాకతో మూడు కిలోమీటర్ల మేర విస్తరించినట్టు తెలుస్తోంది.  

*ముందుగా పాజిటివ్ ఉన్నవారికి మందు ఇస్తాం: ఆనందయ్య*

బాలారిష్టాలు తదుపరి తమ ఆయుర్వేద మందుకు సానుకూలత లభించడంతో  నిర్వాహకుడు ఆనందయ్య

అధికారులకు, ప్రజలకు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. అయితే శుక్రవారం నుంచి ఈ మందును ముందుగా కొరోనా పాజిటివ్ గా ఉన్నవారికి, కొంచెం ఇబ్బందికర స్థితి లో ఉన్నవారికి అందితమని తెలిపారు. తద్వారా వారు ఆరోగ్యాన్ని పొందుతారన్నారు. మరో రెండు రోజుల్లో అందరికి అందించడం జరుగుతుందన్నారు.

  

వివాదం - విచారణ: . .. 

గత కొన్ని రోజులుగా కొరోనా అదుపుకు ఆనందయ్య అనే సంప్రదాయ వైద్యుడు ప్రకృతి అందించిన మూలికలతో మందు తయారు చేసి, వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం తో అందరి దృష్ఠి ఇతనిపై పడింది. 
దీంతో ఇతని మందు సాంకేతిక పరంగా పనికి రాదంటూ  కొందరు  లోకాయుక్త కు ఫిర్యాదు  చేయడం

జరిగింది. దీంతో స్థానిక జిల్లా కలెక్టర్ ఈ ఆయుర్వేద మందుకు తగిన ప్రమాణాలు  ఉన్నాయా లేదా అనే విషయం పై పరీక్షలు జరిపారు. స్థానిక ఆర్డీఓ కొందరు ఆయుర్వేద వైద్యులతో కలిసి ఏ  ఈ కేంద్రాన్ని దర్శించి, మందు తయారీని పరిశీలించారు. వారి ఎదురుగానే ఒక కొరోనా రోగికి మందు ఇచ్చి, ఆక్సిజన్ లెవెల్స్ ని 96 కి పైగా  రప్పించడంతో వారు

సంతృప్తి వ్యక్తం చేసారు.    

రంగం లోకి పొలిసు బలగాలు - చెక్ పోస్ట్ : . . 

అనుమతి లభించడం తో గత రాత్రి నుంచే భారీ సంఖ్యలో జనం చేరుకుంటున్నారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు పొలిసు బలగాలు రంగంలోకి దిగాయి. ఉదయం 7 :30 గంటల సమయానికే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లో  ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద

మందు కోసం భారీ మొత్తంలో ప్రజానీకం వేచి యున్నారు.  కృష్ణపట్నం లోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.  వేలాది మంది కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు. పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం లో కి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో

తీసుకుంటున్నారు. 

కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది ఎక్కడికక్కడ వాహనాలు నుంచి పోతున్నాయి. 

నెల్లూరు మీడియా వాహనాలు కూడా కృష్ణపట్నం కె. . .

పలు వివాదాల అనంతరం ఆనందయ్య మందుకు లైన్ క్లియర్ అవ్వడంతో, ఆ ప్రాంతంలో జరిగే పంపిణీ ని చిత్రీకరించేందుకు అక్కడికి

మీడియా వాహనాలు కూడా బయలు దేరాయి.    చివరకు మీడియా వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయి. నెల్లూరు జిల్లా మీడియా మొత్తం కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam