DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సింహగిరి నాధునికి రెండో విడత చందన సమర్పణ

*సింహాచల క్షేత్రం లో ఏకాంతంలోనే 125 కిలోల చందన సమర్పణ*

*ఈనెల 14 న వైశాఖ తదియ నాడు తొలి విడత చందన సమర్పణ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 26, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం, సింహాచలం లో స్వామికి రెండవ

విడత చన్దనసమర్పణ బుధవారం ఏకాంతంగానే నిర్వహించారు. ఈనెల 14 న వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ త్రితీయ) రోజున స్వామి నిజరూప దర్శనం సందర్బంగా ఏడాది పాటు స్వామి పై ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించి భక్తులకు స్వామి నిజరూప దర్శనం కల్పిస్తుంటారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి 125 కిలోల శ్రీచందనం, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాన్ని

సమర్పించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొరోనా ప్రభావము కారణంగా భక్తులకు గానీ, ఇతర విఐపిలకు గానీ ఎవ్వరికి స్వామి దర్శనం కల్పించలేదు. పూర్తిగా ఏకాంగతంగానే ఈ వేడుకను నిర్వహించారు. బుధవారం తిరిగి రెండవ విడత 125  కిలోల చందన సమర్పణ వేడుక ను కూడా పూర్తిగా ఏకాంతంగాలోనే నిర్వహించారు. 
బుధవారం ఉదయం స్వామికి సుప్రభాత

సేవ, అర్చన, బాలభోగం, రాజభోగం సమర్పించిన అనంతరం రెండవ విడత చందన సమర్పణ చేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam