DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ చాలా ఉపయోగం : ఎమ్మెల్యే జె రాజా

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి) 

*అమరావతి, మే 30, 2021 (డిఎన్ఎస్):* ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజమండ్రి- శాఖ తరపున డాక్టర్ పల్లేల సాయి మణికుమార్ ది రాజమండ్రి- ప్రెస్ క్లబ్ కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వితరణ చేశారు.
ది రాజమండ్రి- ప్రెస్ క్లబ్ లో ఆదివారం  సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్

చైర్మన్ , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతులు మీదుగా  ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ప్రెస్ క్లబ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వల్ల ఎంతగానో ఉపయోగం వుందన్నారు.
కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితిలలో  నిరంతరం సేవలందించే పాత్రికేయులలో కొందరు కోవిడ్ బారిన

పడుతున్నారని అన్నారు.  కరోనా బారినపడి ప్రాధమికంగా ఆక్సిజన్ అవసరం అయన వారికి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఎంత గానో ఉపయోగపడుతుందని  ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో  పాత్రికేయులకు ఎలాంటి ఆపద వచ్చిన తగిన విధంగా వైద్యసేవలు అందించడానికి సిద్ధంగా వున్నామన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు  ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన

జర్నలిస్టులకు సిటీ స్కానింగ్ ఉచితంగా చేయించి అవసరమైతే  మెరుగైన ఆస్పత్రి లో  చికిత్స అందిస్తానన్నారు. పీఎంపీ రాజమండ్రి సీనియర్ సభ్యులు పీ వాసు కుమారుడు  డాక్టర్ పల్లేల సాయి మణి కుమార్, వారి మిత్ర బృందం సహాయం తో  ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను వితరణ చేయడం పట్ల ఎమ్మెల్యే జక్కంపూడి వారిని అభినందించారు. 


కార్యక్రమంలో  ఎపీయూడబ్యూజే రాష్ట్ర కార్యదర్శి , ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి,  ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు రమేష్ రాజా, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam