DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో కొత్తగా 14 వైద్య కళాశాలలకు శంకుస్ధాపన 

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, మే 31, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా 14 వైద్య కళాశాలల నిర్మాణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్మాణ శిలాఫలకాలు ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమం లో విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి,

పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో వైద్య కళాశాలలకు శంకుస్ధాపన జరిగింది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున ఈ విధానం ద్వారా చేసినట్టు అధికారులు తెలియచేస్తున్నారు.  

 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌

మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలోనూ టీచింగ్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు.

పార్లమెంటుకు ఒకటి వంతున 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు

చేస్తుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్యకళాశాలలకు శంకుస్థాపన పూర్తయింది. మిగతా 14 మెడికల్‌ కాలేజీలకు సీఎం ఈ రోజు శంకుస్థాపన చేశారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒకేసారి 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతగానీ, అంతకు ముందుగానీ ప్రభుత్వ పరిధిలో ఎప్పుడూ ఇంత పెద్దస్థాయిలో ఏర్పాటు

చేయలేదు. ఇప్పుడు ఒకేసారి 14 వైద్యకళాశాలలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోను ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేదు.

కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, సీఎస్‌

ఆదిత్యనాథ్‌ దాస్, అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్,

ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam