DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీనియర్ జర్నలిస్ట్, ఎక్స్ ప్రెస్ చారి నిష్క్రమణ బాధాకరం

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 01, 2021 (డిఎన్ఎస్):* సీనియర్ జర్నలిస్టు, ది హన్స్ ఇండియా తూర్పు గోదావరి జిల్లా రిపోర్టర్ ఎస్ . శ్రీనివాసాచారి (చారి)  అనారోగ్యంతో చికిత్స పొందుతూ రాజమండ్రి జిఎస్ఎల్ ఆస్పత్రి లో జూన్ 1 మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతిచెందారన్న వార్త

దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ చారిగా అందరికీ సుప్రసిద్ధులు వీరు. రాజమహేంద్రవరం పత్రికా సమాజంలో అందరితోనూ సన్నిహిత బంధాలు, అనుబంధాలు కలిగిఉన్న వీరి నిష్క్రమణ తీరని లోటు అని ఆంధ్ర ప్రదశ్ జర్నలిస్ట్స్ యూనియన్ అదనపు జనరల్ సెక్రటరీ పెంటపాటి రాజా తెలిపారు.  
గత ఆరు రోజులుగా జిఎస్ఎల్ ఆస్పత్రి లో

ని ఐసీయూలో చికిత్స పొందుతున్న చారి గారి ఆరోగ్య పరిస్థితి ని సీనియర్ పాత్రికేయులు నవీన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  చారి గారి చికిత్స పై ఫాలోఆఫ్ చేస్తూ వచ్చారు. ఈ లోగా ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది.  చారి కి ఇద్దరు కుమార్తెలు, భార్య వున్నారు. చారి మృతికి ప్రగాఢ

సంతాపం తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam