DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పురాణ గురుకుల విద్యకు నిదర్శనం సప్తఋషి వేదపాఠశాల

*వేద ఘోష, గోసంరక్షణ భారత సంస్కృతి లో భాగం*  

*వేద ఉద్యమం లో మనం కూడా భాగస్వాములవుదాం.*

*మాధవ శర్మకు అండదండగా నిలిచి, ఉద్యమంలో పాల్గొందాం* 

*కొరోనా కష్టాల్లోకి నెట్టినా వెనకడుగు వేసేది లేదు: మాధవశర్మ   

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 02, 2021 (డిఎన్ఎస్):*

పురాణ కాలంలో విద్యాభ్యాసం కేవలం గురుకుల ప్రాంగణాల్లోనే జరిగేవి అని వినడం జరిగిందే తప్ప. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి ప్రస్తుత తరానికి లభించే అవకాశం తక్కువే. 
అయితే నాటి పురాణ గురుకుల విద్యకు ప్రత్యక్షంగా అందిస్తూన్న సప్తఋషి వేదపాఠశాల విశాఖ మహానగరంలోనే ఉంది. 

వేద ఘోష ఎక్కడ వినపడుతుందో. . . గోసంరక్షణ

ఎక్కడ నిరంతరం జరుగుతుందో అక్కడ నిత్యం దైవ సంచారం ఉంటుందని, ఇది సనాతన భారతీయ హిందూ సంస్కృతి లో భాగం అని మహర్షులు, మహనీయులు తెలియచేస్తున్నారు. గతం లో ఎక్కడో ఆశ్రమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. ఆధునిక సమాజంలో ఇలాంటివి నగరాలూ, పట్టణాల్లో ఎక్కడ ప్రస్తుతం కనిపించే అవకాశమే లేదు. అలాంటిది విశాఖనగరం లోనే ఒక ఆధ్యాత్మిక

వాతావరణంలో సొంత వ్యవసాయ క్షేత్రంలో వేదాధ్యయనం చేసిన యువకుడు భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టి, వేద సంస్కృతిని కొనసాగించేందుకు నడుం బిగించారు. గత 12 ఏళ్లుగా విశాఖ నగరంలోని సబ్బవరం ప్రాంతంలో సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి, సుమారు 30 మంది విద్యార్థులకు వేద విద్యను పూర్తిగా ఉచితంగానే అందిస్తున్నారు. ఇదే

ప్రాంగణం లో సుమారు 20 గోవులను కూడా సంరక్షిస్తూ హైందవ సంస్కృతిని కొనసాగిస్తున్నారు. 

ఉచిత వేదవిద్య : . . 
ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణ లో ప్రతిరోజూ వేద విద్యార్థులకు వేద విద్యను ఉచితంగానే అందిస్తున్నారు. విద్యార్థులకు వేదశిక్షణతో పాటు, వసతి సదుపాయాలు సహా అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు నిర్వాహకులు, వేద

అధ్యాపకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ. తానూ నేర్చుకున్న వేద విద్యను మరింత ఎక్కువమందికి అందించాలి అనే సంకల్పంతో  సుమారు 12 సంవత్సరాల క్రితం విశాఖనగరం శివారు గ్రామమైన పెద్ద గొల్లలపాలెం ( సబ్బవరం మండలం) లో తన సొంత వ్యవసాయ క్షేత్రం లో విద్యాలయాన్ని ప్రారంభించారు. నేడు ప్రస్తుతం 30 మంది విద్యార్థులు నాలుగు వేద

విభాగాల్లోనూ శిక్షణ పొందుతున్నారు. 

గోశాల: . .. 
వేద శిక్షణ తో పాటు వేదమాతకు ప్రతీక గా నిలిచే గోమాత సంరక్షణ భాద్యతలను కూడా చేపట్టారు. ప్రస్తుతం 20 ఆవులకు ఆశ్రయం కల్పించి, నిత్యం వాటి పోషణ భాద్యతలకోసం ప్రత్యేకంగా సిబ్బంది ని నియమించారు మాధవ శర్మ. 

నిర్వహణ భారమైనా. . .:

ఆదాయం ఏమాత్రం రాని

ఈ విద్యాలయం ను నిర్వహించడం పెను భారమైనప్పడికి విద్యార్థులకు గానీ, విద్య నేర్పించే గురువులకు గానీ, సిబ్బంది కి గానీ, గోశాలకు గానీ ఎన్నడూ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు అనే కంటే నిరంతరం శ్రమిస్తున్నారు అనడం సరి. 

ఆశ్రమ నిర్వహణలో అందరికి ఆహ్వానం. . .

వేద విద్యా ఫలితాన్ని అందరికీ అందించాలి అనే

సంకల్పంతో ఆధ్యాత్మిక వేత్తలు, హిందూ ధార్మిక చింతన కల్గిన పెద్దలు, అందరికి స్వాగతం పలుకుతున్నారు. సబ్బవరం ప్రాంతంలో ఉన్న తమ ఆశ్రమానికి రావాల్సిందిగా మాధవ శర్మ ఆహ్వానం పలుకుతున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందిగా స్వాగతం పలుకుతున్నారు. 

వేద విద్య రక్షణలోనూ, గో శాల

సంరక్షణలోనూ పాల్గొని ఆశ్రమ నిర్వహణలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. 

ప్రతి ఇంటిలోనూ ఎన్నో శుభకార్యక్రమాలు జరుగుతుంటాయని, ఆయా సందర్భాలను పురస్కరించుకుని గోశాల సంరక్షణలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. 

పూర్తి వివరాలకు మాధవ శర్మ, సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్, శ్రీరామ్ నగర్, పెద్ద గొల్లల

పాలెం, సబ్బవరం మండలం, విశాఖపట్నం , ఫో : +91 9492341294. ను సంప్రదించవచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam